మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా
అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు:
ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే
[దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా
చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి
దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు.
అల్లాహ్ "ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి
పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ
మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన
శిక్ష పడుతుంది.
అయితే వారు అల్లాహ్ [యెహోవా] వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా?
అల్లాహ్ [యెహొవా] అమితంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూనూ .
దివ్య ఖుర్ ఆన్ 5 : 72-74
1.యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు
1.అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు [అల్లాహ్] అద్వితీయ ప్రభువు. మార్కు :12 :29
2.అందుకు యేసు - నీ దేవుడైన ప్రభువు [అల్లాహ్]నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.లూకా : 4 : 8
3. నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ
దేవుడునైన వాని [అల్లాహ్]యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను.
యోహాన్ :20:17
యేసు కేవలం "అల్లాహ్ ఒక్కడే దేవుడు" అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు.
11.యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు.
1. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి ....లూకా : 3:21
2. ఆయన [యేసు] పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను. మార్కు 1;35
3.ఆయన [యేసు] ప్రార్దన చేయుటకూ కొండకు వెళ్ళి దేవుని [అల్లాహ్] ను ప్రార్ధించుటయందు రాత్రి గడిపెను.లూకా : 6:12
111.అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు.
1.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను. మార్కు : 9:29
2.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను. యొహాను : 11:35-41
1V.కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు.
1.కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు...మార్కు : 14:35
2. ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. లూకా : 22:44
3. తిరిగి పోయి,యింతకు ముందు పలికిన మాటలనే యేసు పలుకుచు ప్రార్ధించెను. మార్కు : 14:39
V. శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు
1. నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న
నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ
తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:6
2. అందుకాయన [యేసు] - మీరు ప్రార్ధన చేయునప్పుడు తండ్రి [అల్లాహ్] నీ నామము పరిశుద్ధ పరచబడుగాక...లూకా 11: 2-4
3. మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని
నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొదుదురని వారితో చెప్పెను. మత్తయి 21:22
V1.అల్లాహ్ [ప్రభువు] కే కృతజ్ఞతా స్తుతులు యేసు చెల్లించేవారు.
1.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - తండ్రీ [అల్లాహ్]
ఆకాశమునకును,భూమికిని ప్రభువా ,నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను
మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను. లూకా
10:21
2.యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ [అల్లాహ్] నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. యోహాను 11:41
3.ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని
విరిచి తన శిష్యులకిచ్చెను.శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. మత్తయి 15:36
V11.యేసు చేసిన కార్యములకు ప్రజజలు అల్లాహ్ [దెవుని]నే మహిమ పరిచేవారు
1. మూగవారు మాటలాడుటయును,అంగహీనులు బాగుపడుటయును,గ్రుడ్డివారు చూచుటయును జన
సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మత్తయి
15:31
2...వారందరూ విభ్రాంతి నొంది - మనమీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు,దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మార్కు 2:12
3.వెంటనే వాడు చూపు పొంది దేవుని [అల్లాహ్]ను మహిమపరచుచు ఆయన [యెసు]ను
వెంబడించెను.ప్రజలందరూ అది చూచి దేవుని [అల్లాహ్]కు స్తోత్రము చేసిరి. లూకా
18:43
V111.తండ్రి గొప్పవాడు [అల్లాహు అక్బర్] అని యేసు స్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించేవారు.
1. దాసుడు [యేసు] తన యజమాని [అల్లాహ్] కంటే గొప్పవాడు కాడు.పంపబడినవాడు
[అపోస్తులు] పంపినవాని [యేసు] కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. యోహాను 13:16
2. ...యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన
స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన [యేసు] - అవునుగాని దేవుని
వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:27-28
3.యేసు..దేవుని [అల్లాహ్] సువార్త ప్రకటించుచూ గలిలయకు వచ్చెను. మార్కు 1:14-15
4.తండ్రి [యెహోవా] నా యేసు] కంటే గొప్పవాడు. యోహాను :14:28
5...నా తండ్రి [అల్లాహ్] అందరికంటే గొప్పవాడు. యోహాను 10:29
1X.యేసు బోధనలు విస్మరిస్తే కలిగే పర్యవసానం
1.నేను [యేసు] చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా,ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా 6:46
2.మరియు యీనా [యేసు] మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భుద్ధిహీనుని పోలి యుండును. మత్తయి :7:26
3.అప్పుడు - నేను [యేసు] మిమ్మును ఎన్నడును ఎరుగను;అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొడని వారితో చెప్పుదును. మత్తయి 7:23
X.అపార్ధానికి గురియైన ఒకే ఒక్క యేసు బోధ
నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.యోహాను 10:30
తండ్రి [దేవుని] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు తండ్రి [దేవుడు] యు ఉన్నామని నమ్ముడి. యోహాను 14:11
యేసు చెప్పినది అస్తిత్వము విషయములో కాదని కేవలం ఆలోచనల విషయములోనే అని యేసు చెప్పిన మరికొన్ని వాక్యాలను బట్టి మనకు అర్ధమవుతుంది.
ఉదా : కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం
1.నేను [యేసు] నా తండ్రి [దేవుని] యందును మీరు [శిష్యులు] నా [యేసు]
యందును, నేను [యేసు] మీ [శిష్యులు] యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగరు.
యోహాను 14:20
2. ...పరిశుద్ధుడవైన తండ్రీ, మనము [యేసు మరియు దేవుడు]
ఏకమైయున్నలాగున,వారును [శిష్యులందరు] ఏకమై యుడునట్లు నీవు నాకనుగ్రహించిన
నీ నామమందు వారిని కాపాడుము. యోహాను 17:11
3.వారి [శిష్యులు] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు నీవు [దేవుడు]ను ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి... యోహాను 17:23
పై
వాక్యముల ప్రకారము శిష్యులు + యేసు + దేవుడు ఒకరి యందు ఒకరు అస్తిత్వములో
ఏకమై యుంటే దేవుడు + యేసుతో పాటు శిష్యులందరూ దైవత్వంలో
భాగస్వాములైపోతారు.కాబట్టి ఆలోచనలలోనే ఏకం కాగలరు. గాని అస్తిత్వములో ఏకం
కాలేరన్నది నిర్వివాదాంశం.
X1. యోహొవా [అల్లాహ్] ను వదలి ఇతరులను ఆరాధించడం వ్యభిచారం మరియు శాపగ్రస్తము.ఎందుకంటే ???
1. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు.సైన్యములకధిపతి యగు యెహొవా [అల్లాహ్] అని ఆయనకు పేరు. యెషయా 54:5
2.యెహొవా
[అల్లాహ్] ఈలాగు సెలవిచ్చుచున్నాడు.నరులను ఆశ్రయించి శరీరులను తన
కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా [అల్లాహ్] మీద నుండి
తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 17:5
3. ...'నీవు నీ దేవుని [యెహొవా]ను విసర్జించి వ్యభిచరించితివి. హోషేయ 9:1
4. ప్రభువా [అల్లాహ్] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తన 86:5
5......అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకి తిరిగి రమ్మని యెహొవా సెలవిచ్చుచున్నాడు. యిర్మియా 3:1
ప్రియ చదువరీ !
యేసు
బోధనల వెలుగులో దేవుడు [తండ్రి/ప్రభువు/యెహొవా/అల్లాహ్] ఒక్కడే అని రూడీ
అయిన తర్వాత ఆలస్యమెందుకు? నేడే ! ఇప్పుడే !! విరిగి నలిగిన హృదయంతో దేవును
తట్టు తిరుగుము.ఆజ్ఞాతిక్రమం [ముఖ్యముగా ప్రధానమైన ఆజ్ఞ మీరడం] వల్ల
వచ్చిన గొప్ప పాపము నుండి క్షమించమని దేవునికి మొరపెట్టుము.అప్పుడు నీవును
నీ ఇంటి వారును రక్షింపబడుదురు.
X11.చివరిగా యేసు చేసే హెచ్చరిక!!
1.ప్రభువా, ప్రభువా అని నన్ను [యేసును] పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. మత్తయి 7:21
2....అల్లాహ్
[యెహొవా]కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని
[నిత్యజీవాన్ని] నిషిద్ధం చేశాడు.వారి నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు
సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ ఆన్ :5:72.
యేసు సువార్త ద్వారా తెలిసిన విషయం
సర్వ
సృష్తికర్తయైన అల్లాహ్ [యెహొవా] ఒక్కడే ఆరాధనకు అర్హుడైన దేవుడు అన్న
ప్రధానమైన యేసు యొక్క ఈ బోధను తృణీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని
స్పష్టమగుచున్నది.
DOWNLOAD