Posted by Sakshyam Magazine on Monday, July 28, 2014
మనలోని ప్రతి ఒక్కరు పూజలు,ప్రార్ధనలు,ఉపవాసదీక్షలు,ధ్యాన వ్రతాలు మరియు దానధర్మాలు నిత్యం చేస్తూనే ఉంటారు.ఇవన్నీ
ఎవరికొరకు చేస్తున్నట్లు? ఎవరి ప్రసన్నత పొందటానికి ఆచరిస్తున్నట్లు? అని ఎవరిని ప్రశ్నించినా-
"సర్వేశ్వరునికొరకు,ఆయన ప్రసన్నత పొందటానికి "అని అలవోకగా సమాధానం ఇస్తారు.ఇంతవరకు బాగానే ఉంది
.ఇంతకూ ఆ సర్వేశ్వరుడు ఎవరు?అని ప్రశ్నిస్తే మనలోని అధికశాతం ప్రజలు-
"ఫలానా"లక్షనాలు మరియు ఫలానా "సామర్ధ్యాలు కలిగిన అస్తిత్వమే మన సర్వేశ్వరుడు" అని నిర్ధిష్టంగా సామాధానం చెప్పలేరు.అంటే సర్వేశ్వరుడు ఎవరో ఆయన
"మౌలిక లక్షణాలేమిటో?'మరియు ఆయన
"మౌలిక ఆదేశాలేమిటో?"కనీసం గుర్తించకుండానే ఆయనను ఆరాధిస్తున్నారు మనలోని అధికశాతం ధార్మికులు.ఈ పోకడ ఎంతటి అజ్ఞానంతో కూడుకున్నదో మరెంతటి విచిత్రమైనదో ఈ క్రింది ఉదాహరణ ద్వారా మీరే స్వయంగా ఊహించగలరు.
ఒక వ్యక్తి ప్రయాణమవటానికి కావలసిన సకల వస్తుసామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు.ఇంకా ప్రయాణం అయిపోయాడు కూడా.అయితే అతడు కేవలం ఒకె ఒక విషయాన్ని మాత్రం నిర్ధారించుకోలేదు.అదేమిటంటే అతడు చేరవల్సిన గమ్యం."
గమ్యం నిర్ధారణ లేకుండా ప్రయాణం కట్టడం కంటే అజ్ఞాన భూయిష్టమైన చర్య అంటూ ఏదైనా ఉంటుందా?"అని అతనిని ప్రశ్నిస్తే అతడు-
ఒక్క గమ్య నిర్ధారణే కదా నేను విస్మరించింది.పళ్లు తోముకునే పేష్ట్ నుండి ప్రయాణం ఖర్చువరకు అన్నీ సంసిద్ధం చేసుకున్నాను అయినప్పటికీ నన్ను తప్పుపడుతున్నారేమిటి?"అని వాదిస్తున్నాడనుకోండి అలాంటి వ్యక్తికి మీరిచ్చే సలహా ఏమిటి? "
చూడునాయనా! ప్రయాణ సామాగ్రి ఏర్పాట్లలో ఏకాస్త అసంపూర్ణత ఉన్నప్పటికీ నీ గమ్య నిర్ధారణ అనేది మాత్రం నిర్ధిష్టంగా ఉండాలి.అలా కానప్పుడు నీవు ప్రయాణం కొరకు చేసే ప్రతి సన్నాహమూ, ప్రతి ఏర్పాటూ ఎంత నిరర్ధకమో అంతే నిష్ప్రయోజనం అవుతుంది" అన్నదేకదా?
ఈ విధంగా ఇతరుల విషయంలో తీర్పునిచ్చే మీరు సృష్టికర్త అయిన దైవం ఎవరో నిర్ధారించకుండానే ఆరాధనా వ్రతాదులు చేసుకుంటూ పోతున్నారే! మరి దీని సంగతి ఏమిటి?గమ్యనిర్ధారణ లేనప్పుడు ప్రయాణం కొరకు చేసే ప్రతి ఏర్పాటు,ప్రతి సన్నాహం నిరర్ధకం మరియు నిష్ప్రయోజనం అవుతున్నప్పుడు, సృష్టికర్త అస్తిత్వానికి చెందిన నిర్ధారణ జరుగకుండానే మీ చేసే ప్రతి అర్చనా ప్రతి ఆరాధనా మరియు ప్రతి దానమూ ప్రతిధర్మమూ నిష్ప్రయోజనం కాదా?కాస్త ప్రశాంతంగా ఆలోచించండి!
నేడు మన దేవాలయాలు విస్తరింపబడుతున్నాయి.కొత్తవి కూడా వెలుస్తూ పోతున్నాయి.ఏ ప్రార్ధనా మందిరాన్ని చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిట లాడుతున్నాయి.ఎటు చూసినా పూజావ్రతాల కోలాహలం. అన్నివైపులా ఆధ్యాత్మిక సరంభం.సర్వత్రా ధార్మిక ప్రభంజనం. ఇంత జరుతున్నా వ్యక్తుల మనస్సులలో
శాంతి,వ్యక్తిత్వాలలో నీతి మరియు పరస్పర వ్యవహారాలలో త్యాగనిరతి లాంటి విలువలు మటుకు వికాసమొందటం లేదు.
ఇంకా వుంది