Posted by Sakshyam Magazine on Thursday, June 2, 2016
ఎప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే దేవుడిని అంటూ మీ అందరికోసం అవతరించానంటూ అనేకమంది స్వామీజీలు, బాబాలు ప్రకటించుకుంటూనే వున్నారు. అమాయక ప్రజలు ధార్మిక జ్నానం లేక, వైధిక శాస్త్రాల పఠనాశక్తి పొందక ఇటువంటి మాయల్లో పడి నిట్ట నిలువుగా మోసాలకు గురైపోతూనే ఉన్నారు. ఇవ్వన్నీ రూపుమాప బడాలంటే ధర్మం పేరిట సమాజమ్లో జరుగుతున్న వికృత చేష్టలకు అంతం రావాలంటే ప్రతి ఒక్కరూ, ఏ మత వర్గస్తుడైనా ధార్మిక గ్రంధాల పరిజ్నానం పొందాల్సిందే!
నిజానికి దేవుడు నరునిగా వస్తాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒకసారి ఈ క్రింది భగవద్గీత శ్లోకాన్ని చదవండి.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ:
పరం భావ మజానంతే వమామయ మనుత్తమం. గీత:7:24
భావం: నాశరహితమయినట్టియు సర్వోత్తమయినట్టియు,ప్రకృతికి పరమైనట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు నన్ను పాంచభౌతిక దేహం పొందినవానిగా తలంచుచున్నారు.
గమనించాల్సిన విషయాలు:
- ఆయన నాశరహితుడు
- సర్వోత్తముడు
- ఆ పరబ్రహ్మను పాంచభౌతిక దేహం పొందినవానినిగా తలంచుచున్నారు. ఎవరు అంటే అవివేకులు (అజ్ఞానులు) అని గీతాశాస్త్రం ఘోషిస్తోంది.
- జ్ఞానులు దేవున్ని నరునిగా దేహం పొందాడని భావించరు.
- మరొక అద్భుత విషయమేమిటంటే పంచభూతాలంటే 1.అగ్ని 2.నీరు 3.గాలి 4.భూమి 5.ఆకాశం. వీటిలో ఏది దేవుడు ధరించడు.
మరి ఇప్పుడు జరుగుతున్న ఆరాధన వీటికి సంబంధించిదే కదా! ఒకసారి ఆలోచించండి.
మరొక గీతాశ్లోకం చూడండి.
యోమామ జమనాదిం చ వేత్తిలోక మహేశ్వరం
అస్సమూఢస్స మర్త్యేషు సర్వపాపై: ప్రముష్యతే! గీత:10:3
భావం: ఏవడు నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిరూపునిగను, సమస్త లోకములకు నియామకునిగను తెలిసికొనుచున్నడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు.
- దేవుడు జన్మ రహితుడు (పుట్టుకలేనివాడు)
- అనాది-ఆది, అంతం లేనివాడు.
- సమస్తలోకములను శాషించేవాడు.
పై శ్లోకంలో ప్రధానంగా దేవున్ని జన్మరహితునిగా పేర్కొనబడింది. ఏవిధంగానూ ఆయన జన్మించలేదు. నిజానికి ఆయన జన్మనిచ్చేవాడే గాని జన్మించేవాడుకాదు. అందుకనే ఆయన అనాదిం: ఆది,అంతం లేనివాడిగా పేర్కొనబడింది.
అందుకనే కాబోలు అర్జునుడు శ్రీకృష్ణులవారిని ఒక ప్రశ్న అడిగాడు.
అర్జునుని ప్రశ్న:
కిం తద్బహ్మ? దేవుడెవరు? గీత:8:1
శ్రీకృష్ణుని జవాబు:
నాశరహితుడైన సృష్టికర్త పరమందున్నాడు. గీత:8:3
అంటే ఆ సృష్టికర్త ఈ సృష్టికి అతీతంగా పరమందున్నాడు. ఆయన భూమి మీదకు రాలేదు అనే విషయాన్ని చాలా చక్కగా మన వైదిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే విషయాన్ని యేసువారు కూడా చెప్పారు.
భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు.ఒక్కడే మీ తండ్రి.
ఆయన పరమందున్నాడు. బైబిల్
మత్తయి 23:9
మరొక బైబిల్ వాక్యం చూడండి.
దేవుడు నిశ్చయంగా ఈలోకమందు నివాసం చేయడు. 1రాజులు 8:27
అలాగే ప్రవక్త(స) వారు కూడా తెలిపారు.
అల్లాహ్ సప్తాకాశాల పైన పరమందున్నాడు.
కాబట్టి మహాశయులారా! మన దేవుడైన ఆ సర్వేశ్వరుడిని జన్మరహితునిగా, చావుపుట్టుకలుకు అతీతునిగా, సమస్త లోకములకు నియామకునిగా విశ్వసిస్తూ ఇహలోకపు పుణ్యపురుషులను, మహనీయులను గౌరవిస్తూ... పంచేంద్రియాలకు అతీతుడైన ఆయనను మాత్రమే వేడుకోవాలి. ఇదే నిజమైన దైవ ఆరాధనా పద్ధతి!.