Posted by Sakshyam Magazine on Monday, March 2, 2015
ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే స్థాపించలేదని, తరువాతికాలంలో ఇవ్వన్నీ ఉనికిలోకి వచ్చాయని చెబుతూనే శ్రీరాముడు స్వయంగా మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్ధించేవాడనే విషయాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్పాడు.మీరు ఒకసారి పరిశీలించండి.
ప్రశ్న: రామేశ్వరమును రామచంద్రుడు స్థాపించియున్నాడు.మూర్తిపూజ వేదవిరుద్ధమగునెడల రామచంద్రుడు మూర్తి నెందుకు స్థాపించును? రామాయణమున వాల్మీకి యేల వ్రాయును?
ఉత్తరము: రామచంద్రుని సమయమున నామందిరనామముకాని,లింగముగాని యేమియు లేకుండెను. దక్షిణదేశపు రాజు రామనామము గలవాడా మందిరమును నిర్మింపజేసి దానికి రామేశ్వరమని పేరు పెట్టి యుండుట నిజము కావచ్చును. రామచంద్రుడు సీతాదేవిని దీసికొని హనుమంతుడు మున్నగు వారితో లంకనుండి బయలుదేరి విమానము మీద గూర్చుండి యాకాశమార్గమున సయోధకు వెళ్లుచుండిరి. అప్పుడు సీతతో నిట్లనెను.
"ఆత్ర పూర్వం మహాదేవ: ప్రసాదమకరోద్ విభు:,సేతుబంధ ఇతి ఖ్యాతం" -రామా.లంకాకాండం.
"ఓ సీతా! నీ వియోగమున వ్యాకులుడనై నేను దిరుగుచుండెడివాడ. ఇక్కడనే చాతుర్మాస్యము చేసితిని. పరమేశ్వరుని యుపాసనా-ధ్యానము చేయుచుంటిని. సర్వత్ర విభువు-వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని యనుగ్రహమున మాకు గావలసిన సామాగ్రి యంతయు లభించినది.మరియు చూడుము ఈ సేతువును బంధించి లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను దెచ్చుచున్నాము.
ఇంతకు మించి వాల్మీకి రామాయణమున నేమియు వ్రాయలేదు.
ఆధారం: సత్యార్ధప్రకాశము-ఏకాదశ సముల్లాసము.