అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమూలలో లక్షలాది మంది ఋషులను నియమిస్తూ వచ్చాడు. దానికి గల ఆయన లక్ష్యం ఏమిటంటే, మానవకోటి ఆ మహానీయులను ఆదర్శంగా చేసుకోని, జీవనాన్ని సాగిస్తూ తమ జన్మను ఇహ-పరాలలో సార్థకం చేసుకోవాలన్నదే!
అయితే, మానవాళి దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించి, ఇహ-పరాలలో సర్వనాశనం అయిపోవాలన్నది మాయగాడి లక్ష్యం. దానికి గాను వాడు మానవులను మానవత, నైతికత పరంగా పతనం చేస్తూ పోతున్నాడు. మహానీయులపై అభాండాలకు గల కారణం ఇదే!
వాడి దుర్మార్గం ఎక్కడవరకు వెళ్లిపోయిందంటే; ప్రేమకు, త్యాగానికి, క్షమాశీలతకు ‘బంకోలాలు’ (lighthouses) గా నిలిచి ఉన్న శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహానీయుల పవిత్ర చరిత్రలో సైతం కాలుష్యం సృష్టిచి, ‘విలువల ఆదర్శం’ విషయంలో అనాథలుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
తన ఈ దుర్మార్గాన్ని అంచెలంచెలుగా ప్రారంభించాడు. మొదటగా, ఒక మహానీయుని వర్గం వారు ఎదుటి వర్గానికి చెందిన మహానీయుని విమర్శించేలా చేసాడు. ఇది అందరికీ తెలిసిందే. ఆ తరువాత, ఎవరి మహానీయుని వారే విమర్శించుకునేలా చేసాడు.
ఉదాహరణకు: రామాయణం రంకు, భారతం బొంకు అని కొందరు హిందువులు ఇంకా, యేసు హోమో సెక్సువల్ అని కొందరు క్రైస్తవులు అలాగే ఖురాన్ సాటానిక్ వర్సెస్ అని కొందరు ముస్లిములు స్వయంగా విమర్శించే విధంగా దుర్మార్గుడైన ఆ మాయగాడు ప్రేరేపించాడు. శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులు, వందకు వందశాతమూ ఆదర్శనీయులు!
అదెలాగో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి...
ఇక్కడ రెండు విషయాలు గమనార్హం. వాటిలో...
- వారి జీవితాలను పరిశీలిస్తే, వాటిలో ప్రేమా-త్యాగాలకు, నైతికతా-మానవతా విలువలకు పరాకాష్ఠ ఆదర్శాలు కనిపిస్తున్నాయి.
అటువంటి వారిలో అంత దారుణమైన కౄరత్వం, భోగలాలసత్వం, వంచన బుద్ధి వంటి నేరపూరిత లక్షణాలు ఎలా వుంటాయి!? కాస్త ప్రశాంతంగా ఆలోచించండి.
- స్వయంగా మన పూర్వీకులు కొన్ని వేల, వందల సంవత్సరాల నుండి వారిని దివ్య పురుషులుగా విశ్వసిస్తూ, అనుసరిస్తూ వస్తున్నారు.
దీని ప్రకారం- పక్షపాత, తీవ్రవాద వైఖరులు కలిగిన కొందరు హిందూ-క్రైస్తవ-ముస్లిం వ్యక్తులు మహానీయులపై ఏ విమర్శలైతే చేస్తున్నారో వాటి ప్రకారం, వారు తమ పెద్దలను మూర్ఖులుగా జమకట్టినట్లే కదా!
గ్రుడ్డి విమర్శ వేరు - పరిశీలన వేరు!
‘మహానీయుల విషయంలో అసలు ఎలాంటి ‘చర్చ’ చేయకూడదు’ అనటం ఒక విధమైన తీవ్ర వాదమైతే; ఎవరో ఏదో అన్నారని వారిపై అక్కసు పెంచుకొని అల్లరి చిల్లరగా, అలగా జనంగా మాటలాడుతూ ‘రచ్చ’ చేయటం మరొక విధమైన తీవ్రవాదం అవుతుంది. మత సామరస్యం చెడిపోయి, మత ఘర్షణలు ఏర్పడేది అలాంటి తీవ్రవాద మనస్కుల వలనే.
ఒకవైపు మహానీయులుగా కొనియడబడుతూనే మరొకవైపు మానవత-నైతికత-లైంగీక నేరాలకు పాల్పడినట్లు కనబడుతున్నట్లైతే, దాని గురించి తెలుసుకోవాలనిపిస్తే గౌరవప్రదమైన రీతిలో హూందాతనంతో పరిశీలించాలి లేక చర్చించాలి. ఇది ఉత్తముల లక్షణం.
ఎవరి మహానీయున్ని ఎవరూ ఏమీ చేయలేరు!!
కొందరు అవివేకులైన ముస్లిములు శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని.
అలాగే, కొందరు అవివేకులైన కైస్తవులు శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని.
అదే విధంగా కొందరు అవివేకులైన హిందువులు యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహనీయులను అవమానపరచి, వారిని నామ రూపాలు లేకుండా చేద్దామనుకుంటున్నారు. అది కూడా ఎప్పటికీ సాధ్యం కాని పని.
ఇక్కడ మహాత్మ గాంధీ అభిప్రాయం గమనార్హం.
“
I don't expect India my dream to develop one religion i e; to be wholly Hindu or wholly Christian or wholly Musalman, but I want it be wholly tolerant with its Religions working side by side with one another”.
-Mahatma Gandhi said an interview of Yong India on 22-12-1927.
దీనిని బట్టి, ఒకరి ధార్మిక వ్యవస్థను మరొకరు సమూలంగా అంతం చేద్దామని చేసే ప్రయత్నం ఎప్పటికీ సఫహలం కాదు, కాబోదు!
దానికి సోవియట్ యూనియన్ ప్రబల గుర్తు!
దైవాతీత, ధర్మాతీత సాంఘీక వ్యవస్థ స్థాపన కొరకు చేసిన ప్రయత్నానికి రష్యా ప్రయోగం ప్రరాకాష్ఠ. అటువంటి ప్రయత్నం గత చరిత్రలో జరిగినట్లు ఆధారాలు లేవు. భవిష్యత్తులో జరిగే అవకాశమూ లేదు. ఎందుకంటే, 94 million అంటే సుమారు తొమ్మిది కోట్ల నలభై లక్షల మందిని హతమార్చి ఆ వ్యవస్థ స్థాపించబడింది. అలాగే బయటి ప్రపంచ గాలి సోకకుండా సుమారు డభై ఐదు సంవత్సరాలపాటు ఇనుప తెరలలో బంధించి ఉంచినప్పటికీ, వాటన్నిటినీ బ్రద్ధలు గొట్టు కొని
దేవుడు-ధర్మము అనే దృక్పథాలు బయటకు వచ్చేసాయి. దేవాలయాలు, చర్చీలు, మసీదులు ఒక్కపెట్టున తెరుచుకున్నాయి.
‘సామూహిక ధార్మిక భావజాలాన్ని అంతం చేయటం ఎన్నటికీ సాధ్యంకాబోదు’ అనే విషయానికి ‘సోవియట్ యూనియన్ ప్రబల గుర్తు!’
అలాగే ‘
వివిధ ధార్మిక వర్గాల గుర్తింపులను అంతంచేయ సాధ్యం కాదు’ అనటానికి కూడా ఆ పరిణామం ఒక ఆధారమే! అయినప్పటికీ అటువంటి ప్రయత్నం చేయ బూనటం చేజేతులారా తమ జీవిత కాలాన్ని నాశనం చేసుకోవటమే కాగలదు. చరిత్ర నుండి గుణపాఠం గరిపిన వారే విజేతలు. దానిని విస్మరించిన వారే పరాజితులు అన్నదీ చరిత్ర పాటమే కదా!
ఈ నేపథ్యంలో... ఏమైనా చేతనైతే; వివిధ ధార్మిక వర్గాలలో ఏర్పడిన మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని వారి వారి ధర్మశాస్త్రాల ప్రభోదనల ఆధారంగా సరి చేయటానికి ప్రయత్నించాలి. మహాత్మ గాంధీ చెప్పినట్లు, వివిధ మత వర్గాల మధ్య మత సామరస్యం పెంపొందించటానికి పాటుపడాలి. దానికి విరుద్ధంగా
శ్రీ రాముడు-శ్రీకృష్ణుడు-యేసు క్రీస్తు-ప్రవక్త ముహమ్మద్ వంటి మహానీయులను పరస్పరం ఘోరంగా విమర్శిస్తూ, మత వర్గాల మధ్య అగాధాలను పెంచుతూ మన హిందూ జాతి విచ్చిన్నానికి కారకులు కారాదు. మన జాతిని బలోపేతం చేసే విధానాన్ని అనుసరించే సద్భాగ్యాన్ని
సర్వోన్నతుడైన సర్వేశ్వరుడు మనందరికీ ప్రసాదించునుగాక. తథాస్తు! - జై హింధ్!
What is the reason for the blame for the great men?
M.A.Abhilash
tmcnewstmc@gmail.com
9848516362