Posted by Sakshyam Magazine on Wednesday, February 24, 2016
1. విగ్రహారాధన ప్రాచీనమా? లేక
ఏకేశ్వరోపాసన ప్రాచీనమా?
నేడు
హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక
ధర్మం.
దానినినే- ఆర్ష ధర్మం అంటారు.
అనగా- రుషుల ద్వారా ప్రబోధించబడిన ధర్మం అనే అర్థం వస్తుంది. ఇంకా దానిని-
సనాతన ధర్మం అని కూడా అంటారు. సనాతనం అనగా అనాదిగా వస్తున్న ధర్మం లేక నిత్యనూతనమైన ధర్మం అనే అర్థం వస్తుంది. ఈ ధర్మం
ప్రత్యేకతలు మూడు ఉన్నాయి. వాటిలో...
1.
సార్వ కాలికం, 2. సార్వ
జననీనం
మరియు 3. హేతుబద్ధం.
ఈ విషయం కొందరికి ఎంతో
వాస్తవంగా అనిపిస్తే,
కొందరికి
ఆశ్చర్యం
కలిగిస్తుంది.
మరి కొందరికైతే- అవహేళంగా తోస్తుంది! అలాంటి వారంతా ఏకాభిప్రాయానికి
రావాలంటే- యుగ సంస్కర్త అయిన స్వామీ వివేకానంద తెలుపుతున్న ఈ క్రింది విషయాన్ని
గమనించాలి.
"ప్రవక్తలు వేరు; మతాచార్యులు/పురోహిత వర్గం లేదా
మత ప్రచారకులు వేరు. మూఢ విశ్వాసాలను వ్యతిరేకించటం ప్రవక్తల పని కాగా, మూఢ నమ్మకాలను పెంచేందుకు నడుం
కట్టింది పురోహిత వర్గం. ఈ ప్రత్యేక వర్గానికి ప్రపంచంలో మరేదీ పట్టదు. నిజానికి ఈ
ప్రపంచం ప్రకృతి ప్రసాదం. దార్శనికులైన ప్రవక్తలు మూఢ విశ్వాసాలను సవాలు
చేసినవాళ్లు. కాగా, మతాచార్యులు లేదా పురోహిత వర్గమే 2000 రకాల ఆచారాలనూ, కర్మకాండలనూ సృష్టించారు".
దీని కారణంగా- వ్రవక్తలు దైవం తరఫున అందించిన ‘సశాస్త్రీయ ధర్మం’, ఒకవైపు వంచకులైన పండితుల ద్వారా
కల్పించబడిన వేలాది మూఢ విశ్వాసాల-మూఢాచారాల క్రింద పడి, ‘కను మరుగు అయిపోయింది’. మరోవైపు వారు కల్పించిన ‘అశాస్త్రీయ ధర్మం’ జనసామాన్యంలో ‘సర్వసామాన్యం అయిపోయింది’. ఆ తప్పుడు ధర్మం వలన ఒక్క పూజారి వర్గానికి
తప్ప సామన్య భక్తులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సరికదా- దానిని అనుసరిస్తున్నకారణంగా సామాన్య
భక్తజనం- ఒకటి భావదాస్యానికి మరియు నైతిక బలహీనతలకు గురైపోతారు. ప్రస్తుతం హిందూ సమాజం
ఈ పరిస్థితికే గురై ఉంది. అందుకే,
హిందూ
ధర్మం- సార్వ
కాలికం,
సార్వ జననీనం మరియు హేతుబద్ధం వంటి ప్రత్యేకతలను కలిగి ఉందంటే- కొందరికి
ఆశ్చర్యం కలిగితే మరి కొందరికి అవహేళంగా తోస్తుంది!
హిందూ ధర్మంలోని ఈ మూడు ప్రత్యేకతలను గాంచ గలగాలంటే-
మన వంచకులైన పురోహిత వర్గం సృష్టించిన 2000 రకాల
ఆచారాలను, కర్మకాండలను తొలగించి వాటి వెనుకకు వెళ్ళి చూడవలసి ఉంటుంది. మిమ్మల్ని
అక్కడకు తీసుకు వెళ్ళేవే మా ఈ వ్యాసాలు! కనుక వీటిని 'విమర్శ దృష్టి'తో కాక 'పరిశీలన దృష్టి'తో
చూడాలని సవినయంగా కోరుకుంటున్నాము. అయితే క్రైస్తవ, ముస్లిం ధార్మిక వ్యవస్థలూ అచ్చం అదే దౌర్భాగ్యానికి గురై ఉన్నాయన్నది
గమనార్హం!
ఒకటి- నేటి మన ఒక్క హిందూదేశానికే కాదు, పూర్తి
ప్రపంచానికే ప్రాచీన యుగం వైదిక యుగం. రెండోవది- ధర్మం నాల్గు పాదాలా నడచిన కాలానికీ
వైదిక యుగమే ప్రామాణికం. ఈ విషయాన్ని సకల హిందూ పీఠాధి పతులూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారన్నది
ఇక్కడ అత్యంత గమనార్హం. ఆ యుగంలొ ఏకేశ్వరోపాసన తప్ప బహుదైవోపాసన లేదన్నది ఎవ్వరూ తిరస్కరించలేని ఒక సత్యం. దీనిని
బట్టి ఏకేశ్వరోపాశనే తప్ప విగ్రహారాధన ప్రాచీనం కాదని అర్ధం అవుతుంది.
విగ్రహాలు లేని కాలం, విగ్రహాలు ఉన్న
కాలం, విగ్రహారాధన కాలం
మన
హిందూ ధార్మిక చరిత్రను కాస్త నిశితంగా గమనిస్తే విగ్రహాలు ఏమాత్రం లేని కాలం ఒకటి
గడచింది. విగ్రహాలు ఉన్న కాలం ఒకటి గతించింది. అంటే విగ్రహాలు ఉండేవి కానీ వాటి ఆరాధన
జరిగేది కాదు. ఈ రెండు కాలాలలోనూ ఏకేశ్వరరాధనే జరిగింది. ఆ తరువాత ఇటీవలి కాలంలొ అంటే
సుమారు నాల్గు వందల సంవత్సరాల నుండి విగ్రహారాధన ప్రారంభం అయ్యింది. అంటే అంతకు ముందర
కాలంలొ విగ్రహాలను ఆరాధించే దురాచారం ఉండేది కాదన్నమాట.
విగ్రహాల ఆవిర్భావానికి గల మూల కారణం ఏమిటి?
ప్రాచీన
కాలంలో అనగా, క్రొత్త-పాత రాతి యుగాలకు పూర్వం మన వైదిక సమాచారం-వాంగ్మయం
అనగా పఠనం రూపంలో ఉండేది. ఆనాడు వేద జ్ఞానాన్ని కంటోపాఠం పెట్టిన వారు ఉండేవారు. వారినే
స్మర్తలు అంటారు. ఇది విగ్రహాలు లేని కాలం. ఆకాలంలో వేద జ్ఞానం ‘శ్రుతి’ లేక ‘శబ్దం’ రూపంలో సాధారణ వ్యక్తులకు సర్వేశ్వరుని ద్వారా వినిపించబడ్డాయి.
అందుకే వాటిని “శ్రుతులు” అని అంటారు. ఇంకా
ఆ కారణం చేతనే వాటిని ‘అపౌరుషేయములు’ అని
కూడా అంటారు. దాని అర్ధం ఏమిటంటే- మానవ ప్రమేయం లేని ‘ఈశ్వర జ్ఞానము’. ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రధాన విషయాలు- అక్షర పరబ్రహ్మ అయిన ఆ సర్వేశ్వరుడు
సృష్టి-స్థితి-లయ కారకుడు. దీనినే పొడి అక్షరాలలో ‘GOD’ అని అంటారు.
అనగా G for Generator (సృష్టించేవాడు),
O for Organizer సృష్టించిన వాటిని (పోషించేవాడు)
మరియు D for Destroyer అనగా తను వాటిని
ఏదో ఒక రోజు (అంతమొందించేవాడు). దేవుడు మౌలికంగా ఈ మూడు కార్యాలను చేస్తూ ఉంటాడు. ఆయనకు
ఉన్న శక్తులు సమర్త్యలు అనంతం. వాటిలో మౌలికమైనవి- ఆయన సకల ఐశ్వర్యాలకు అధిపతి లేక
కుబేరుడు. అనగా ‘లక్ష్మి’. అలాగే ఆయన అనంతజ్ఞాని.
అనగా ‘సరస్వతి’. ఇంకా ఆయన మహా శక్తిమంతుడు
లేక రౌద్రుడు. అనగా ‘కాళీ’ లేక ‘దుర్గ’.
మన పూర్వికులను కొనియాడక తప్పాదు!
క్రొత్త
రాతియుగానికి పూర్వం వరకు వాంగ్మయం (Verbal) రూపంలో ఉన్న పైన పేర్కొన్న
వైదిక సమచారాన్ని వినికిడి (శ్రవణం) ద్వారా ప్రజలకు అందిస్తూ ఉండేవారు. ‘శబ్దం’ (Audio) కంటే, ‘దృశ్యం’ (Video) ద్వారా మనిషి సమాచారాన్ని వేగంగా గ్రహించగలడు.
పాశ్చాత్యులు గత నూట యాభై సంవత్సరాలకు పూర్వం మాత్రమే కనుగొన్నారు.
కాని, మన పుర్వీకులైతే
ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే కనుగొన్నారు. అయితే ఆ రోజులలో Art Painting, Video grapy వంటి వాటి పరిజ్ఞానం లేదు. కనుక
‘శిల్ప ఆగమన శాస్త్రము’ను కనిపెట్టి దానిని
అభివృద్ధి పరిచారు. దాని ద్వారా ‘శబ్దం’ (Audio) రూపంలో ఉన్న వైదిక సమాచారాన్ని ఉదాహరణకు- నాలుగు ముఖలున్న విగ్రహం చేసి,
‘బ్రహ్మ’ అన్న శబ్దమును ‘దృశ్యం’ (Video) రూపంలోనికి మార్చారు. దీనిని ఆనాడే కనిపెట్టినందుకు
మన పూర్వీకులను కొనియాడ వలసిన అవసరం లేదంటారా? ఇంకా అలాగే- కుబేరుడు,
అనంతజ్ఞాని, రౌద్రుడు అన్న దేవుని శక్తుల ‘శబ్దా’లకు ‘సరస్వతి’, ‘లక్ష్మి’, ‘కాళీ’ లేక ‘దుర్గ’ వంటి విగ్రహాలుగా ‘దృశ్య’
రూపం ఇచ్చారు. అంటే ఇది ప్రాచీన కాలంనాటి ‘సమాచార
సాంకేతిక పరిజ్ఞానం’ (Information Technology). అంటే- ‘అదృశ్య రూపం’లో ఉనికినికి కలిగి ఉన్న అక్షర పర బ్రహ్మకు
చెందిన శక్తీ సామర్థ్యాలను ‘దృశ్య రూపం’ ఇవ్వటమైనదన్న మాట! ఈ ఒక్క ధార్మిక విషయాలే కాక సామాజిక, నైతిక, సాంస్కృతిక, లైంగీక తదితర రంగాలకు సంబంధించిన విద్యలనూ శిల్పాలలో మలచి విద్యాబోధనలో దృశ్య, శ్రవణ (Audio and video) పరికరాల వాడుక విధానాన్ని మన పెద్దలు ఆనాడే అవలంభించటం జరిగింది. ఇదే విగ్రహాల ఆవిర్భావానికి గల మూల కారణం. ఆ కాలంలో ప్రజలు
విగ్రహాల ద్వారా ఒక్క ‘సమాచారము’ను గ్రహించటం తప్ప ‘ఆరాధన’ను మాత్రం చేసేవారు కాదు. అదే విగ్రహాలు ఉన్న కాలం. ఈ పరిశీలనను బట్టి ఏకేశ్వరోపాసన ప్రాచీనమైనదని మరియు విగ్రహారాధన కాల్పనికమైనదని
సుస్పష్టం అయ్యింది.
జైహింద్!
M. A. Abhilash
91+96664
88877
tmcnewstmc@gmail.com