Posted by Sakshyam Magazine on Thursday, January 26, 2017
మనిషికి శాస్త్రీయ గ్రంధాల పరిజ్ఞానం కలిగి లేకపోవడమే ప్రధాన కారణం. నిజమైన సృష్టికర్తను విడిచి పెట్టి సృష్టితాలను ఆరాధించడమే ప్రధాన అజ్ఞానం. ఎవడూ ఒక వస్తువును తయారు చేసిన తరువాత ఆ వస్తువులోకి దూరిపోడు. ఆ వస్తువులో తను ఉండడు కూడా! అలాగే ఈ యావత్తు సృష్టిని తయారు చేసిన దేవుడిని ఈ సృష్టితో పోల్చడం, దానిని మొక్కితే ఆ దైవాన్ని మొక్కడం లాంటి సిద్దాంతం ఎప్పటికీ అజ్ఞాన పూరితమే! ఇదే అనేక మూఢ నమ్మకాలకు పునాది అయిపోతుంది. నిజానికి సృష్టితం అనేది సృష్టికర్త గొప్పతనాన్ని తెలియజేయడానికే గాని వేడుకోవడానికి కాదు.