Posted by Sakshyam Magazine on Monday, October 28, 2013
యేసు పునరుత్థానం గురించి పశీలిద్దాం
ఎవడును నా ప్రాణము తీసికొనడు.నా అంతట నేనే దాని పెట్టుచున్నాను.దాని పెట్టుటకు నాకు అధికారం కలదు.దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు.నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను. -యోహాన్:10:18
యేసు ప్రజల విమోచన క్రయధనముగా తనంతటతానే మనస్పూర్తిగా ప్రాణములనర్పించి, మూడవ రోజు పునరుత్థానం చెంది సజీవముగా లేస్తాడని పౌలు చేసిన ప్రచారానికి నిదర్శనంగా పై వాక్యం అద్దం పడుతున్నది. విచిత్రమేమిటంటే మాటలైతే కనపడుతున్నాయి కాని చేతలలో చాలా వైరుధ్యం ఉంది.
తనను లజ్జాకరమైన మరణమునుండి రక్షించమని దేవుని ప్రార్ధిస్తారు.
అప్పుడు యేసు -మరణమగునంతగా నా ప్రాణము బహుదు:ఖములో మునిగియున్నది.మీరు ఇక్కడ నిలిచి,నాతో కూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి-కొంతదూరము వెళ్లి సాగిలపడి-నా తండ్రీ సాధ్యమైతే ఈ గిన్నె [మృతువు] నా యొద్దనుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టప్రకారము కాదు.నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్ధించెను. మత్తయి :26:38-39
ఆయనే గనుక మనుష్యుల పాపపరిహారానికి తన ప్రాణాలనర్పించే వాడైతే అటువంటి మంచి అవకాశం లభించినప్పుడు "మరణమగునంతగా నా ప్రాణము దు:ఖములో మునిగియున్నది"అని ప్రాధేయపడి ఉండేవారా?అలా ఎప్పటికీ చెప్పి ఉండేవారు కాదు.మరేమి చెప్పిఉండేవారు? "నేను ఏకార్యానికైతే పంపబడ్డానో ఆ మంచి తరుణం ఆసన్నమైంది.ఇది నాకు అమూల్య అవకాశం.కాబట్టి ఈ దినం నాకు చాలా ఆనందముగా ఉన్నది.ప్రభూ! ఈ కార్యాన్ని నిరాటంకముగా జరిపించు" అని తన సంతోషాన్ని వ్యక్తపరిచి వుండేవారు.దానికి బదులుగా తనకై పొంచివున్న సిలువమరణం నుండి రక్షించమని దేవుని వేడుకున్నారు.ఈ విధమైన ప్రవర్తనను పరిశీలించినట్లయితే [యోహాన్ 10:17-18]లో చెప్పిన మాటలు నిజమేనా అనిపిస్తాయి.
యేసు తాను పట్టుబడకుండా మారువేషాల్లో ఉండేవారు
ఆయనను అప్పగించువాడు-నేనెవరిని ముద్దుపెట్టుకుందునో ఆయనే యేసు;ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి-బోధకుడా!నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. -మత్తయి 26:48-49
ఆయన మారువేషంలో ఉన్నట్లు పై వాక్యాలు రుజువు చేస్తున్నాయి. ఆయన ప్రజల పాప విమోచన క్రయధనంగా తన ప్రాణత్యాగం చేయడానికే వచ్చినవాడని అనుకుందాము.అలాంటప్పుడు ఆయన సిలువ మరణమ్నుండి తప్పించుకోవటానికి,పట్టుబడకుండా ఉండటానికి మారువేషాల్లో తిరిగేవారా?
ఆత్మరక్షణ ప్రయత్నం: కత్తిలేనివారు తమ బట్టలనైనా అమ్మి కత్తులను కొనవలసిందిగా తన శ్ష్యులకు ఆజ్ఞాపించారు.
...కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను -లూకా:22:36
పారిపోవడానికి ప్రయత్నించారు.
లెండివెళ్లుదము.ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడు.-మత్తయి 26:46
ఆయన పట్టుబడిన తర్వాత కూడ తనను విడిచి పెట్టవలసిందిగా అభ్యర్ధించారు.
...NOR LET ME GO [నన్ను వెళ్లనైనా వెళ్లనివ్వరు -ఈ మాటలను తెలుగు బైబిల్ నుండి తీసేసారు] -లూకా 22:68
ఆయనే గనుక 'లోక పాపభారమును మోసికొనుపోవు గొర్రెపిల్ల [యోహాన్ 1:29] అయితే కసాయివానికి అప్పగించబడకుండా రక్షించమని ప్రార్ధించి తన మనోవాంఛను ఎందుకు బహిర్గతం చేశారు?
సిలువపై చివరి ఘడియలు చేరుకోనున్న సమయంలో 'నాదేవా,నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి?[మత్తయి 27:46] అని ఆయన చెప్పిన మాటలు సిలువమరణంపై ఆయనకున్న అయిష్టతకు అద్దం పడుతున్నాయి.
సిలువ దండనకు పూర్వం యేసు ప్రవర్తించిన పై విషయాలు పూర్వాపరాలను పరిశీలించి గ్రహించిన విషయమేమిటంటే - ఇతరుల పాపపరిహారానికి తన జీవితాన్ని పణంగా పెట్టి లజ్జాకరమైన సిలువమరణం పొందటానికి యేసు పంపబడలేదు కాబట్టి యోహాన్ 10:17-18లో యేసు ఈ మాటలు చెప్పివుండరని స్పష్టం అవుతుంది.
1 2 Next