Posted by Sakshyam Magazine on Monday, September 22, 2014
యేసు యూదుల (ఇశ్య్రాయేలు) ప్రజల సంస్కరణ నిమిత్తం మాత్రమే పంపబడ్డారు. సంస్కరణ అనేది మార్గము తప్పి అనుసరిస్తున్న వారికి మాత్రమే అవసరం గాని సన్మార్గగాములకు అవసరము లేదు అనే విషయాన్ని గ్రహించాలి.ఈ విషయాన్ని యేసు ఈ క్రింది వాక్యాలలో స్పష్టంగా చెప్పారు.
అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కర లేదు.
మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతి
మంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లూకా 5:31-32
యేసు తన శిష్యులను ప్రచారం నిమిత్తం పంపించే సమయంలో అన్యులలో ఏమాత్రం ప్రచారం చేయవద్దని అయితే ఇశ్రాయేలీయులలో మార్గం తప్పిన ప్రజల వద్దకే గాని మరి యెవరివద్దకు వెళ్లవద్దని స్పష్టంగా ఆదేశించారు.ఇది చదవండి.
యేసు ఆ పండ్రేండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించిన
దేమనగా - మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే
పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని,ఇశ్రాయేలు వంశములోని నశించిన
గొఱ్ఱెల యొద్దలకే వెళ్లుడి. మత్తయి 10:5-6
ఆ విధంగా ఆజ్ఞాపించడంలోని ఆంతర్యం ఏమిటో ఈ క్రింది వాక్యంలో స్పష్టపర్చుచున్నారు.
ఆయన-ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి
యొద్దకును నేను పంపబడలేదనెను. మత్తయి 15:24
ఆయన సంస్కరించడానికే గాని మరిదేని నిమిత్తం రాలేదని ఇంకా స్పష్టమైన విధంగా ఈక్రింది వాక్యంలో నిర్వచించారు.
యేసు ఆ మాటవిని -రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు;
నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని
వారితో చెప్పెను. మార్కు 2:17
పై వాక్యాలన్నీ యేసు ఎందు నిమిత్తం పంపబడ్డారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏ జాతిలోనైనా సంస్కర్త పంపబడినప్పుడు -ఆ జాతిలోని అధిక శాతం ప్రజలు మార్గభ్రష్టత్వంలో మునిగి వుంటారు.మరికొంతమంది అయితే సన్మార్గంలోనే వుంటారు.అట్టి వారికి సంస్కరణలతో పని వుండదు.ఈ భావాన్నే ఆయన తన మాటలలో "
రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు" అని చెప్పారు.ఈ విధంగా ఆయన కేవలం ఇశ్రాయేలు జాతివారికి మాత్రమే సంస్కర్తగా వచ్చారని స్పష్టపర్చారు.అంతేకాదు వారిలోను మార్గం తప్పినవారి కోసమే వచ్చానని స్పష్టం చేసివున్నారు.
ఇంత స్పష్టంగా యేసు వారు ఇశ్రాయేలు జాతికొరకు అని చెప్పిన తరువాత కూడా మీకు రక్షణ కావాలంటే యేసును నమ్ముకోండి అనే ప్రచారం భారత దేశ ప్రజలకు వర్తిస్తుందా? యేసు వారి ఆజ్ఞలు భారత దేశ ప్రజలకా?ఇశ్రాయేలీయులకా?
పై వాక్యాలను బట్టి యేసు రక్షకుడుగా వచ్చింది కేవలం ఇశ్రాయేలీయులకొరకే గాని మరెవరికొరకూ కాదు.
నేటి భారత పాస్టర్లు ఇక్కడి థార్మిక గ్రంధాలను,మహనీయులను విమర్శిస్తూ, తూలనాడుతూ క్రైస్తవం స్థాపించడం అనేది చాలా దారుణం. క్రైస్తవాన్ని స్వీకరించి ఆఖరికి బైబిల్ కూడా సమర్ధించని సిద్ధాంతాలను పట్టుకు వేలాడటం మరీ దారుణం.
మీరు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి దారి చూపుతారా? అని ఆనాటి శాస్త్రుల పట్ల యేసు విమర్శ నేటి క్రైస్తవ పండితులకు సరిగ్గా సరిపోతుంది.