Posted by Sakshyam Magazine on Friday, September 1, 2017
థర్మ పరిరక్షణ జరుగుతున్నది పండితుల వలనే! అలాగే థర్మానికి చేటు కలుగుతున్నదీ పండితుల వలనే!! అందరిలోనూ మంచివారు-చెడ్డవారు ఉన్నట్లే, పండితులలోనూ మంచివారు,చెడ్డవారు ఉన్నారు. పండితులూ మానవమాతృలే కదా! థర్మపు యధార్థ స్వరూపాన్ని గ్రహించాలనుకొనే వారు చూడవలసింది శాస్త్రాల ప్రబోధనలనే గాని శాస్త్రుల వ్యాఖ్యానాలను కాదు. ఇది ప్రతి థార్మిక వర్గానికీ వర్తిస్తుంది. శాస్త్రుల తప్పుడు వ్యాఖ్యానాలనే శాస్త్రాల ప్రబోధనలనుకుని వాటిని దూషించడం తొందరపాటు తనమే కాక, అత్యంత అన్యాయం కూడా. అలాంటి వారిలో డా.బి.ఆర్.అంబేద్కర్ లాంటి మేదావీ ఉండటం కడు విచారకరం. హేతుబద్ధమైన, న్యాయవంతమైన సార్వ జనీన ప్రబోధనలను కలిగి ఉన్న థర్మ శాస్త్రాలను చేత పట్టుకుని తమ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని తప్పుగా వ్యాఖ్యానించేవారు రెండు ఘోర నేరాలకు పాల్పడుతున్నట్లే. మొదటిది- తప్పుడు వ్యాఖ్యానం చేసే నేరం. రెండవది- దాని కారణంగా థర్మ శాస్త్రాల వంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదకు మేధావులు దూరమైపోయే నేరం. వాటి నుండి త్వరగా బయటపడే సద్భుద్ధి అలాంటి నేరాలకు పాల్పడే శాస్త్రులందరికీ కలుగును గాక! తథాస్తు.
థర్మ గ్రంథాలు చెప్పెదొకటైతే, మత బోధకులు వ్యాఖ్యానించేది వేరొకటి! అన్న రీతిలో నేటి థార్మిక వ్యవస్థ నడుస్తుంది. దానికి బండ గుర్తు ఏమిటంటే - గొప్ప థర్మ గ్రంథాలు కలిగి ఉండి వాటిని నమ్ముతున్న ప్రజలు గొప్పవారు కాలేకపోవటమే! దానికి కారణం- గొప్ప ధర్మ గ్రంథాల గొప్ప సందేశమును సామాన్యులకు యథాతథంగా అందించని వంచకులు,స్వార్థపరులైన పండితులే! ప్రతి థార్మిక వర్గంలోనూ అటువంటి వారే అధిక శాతం తిష్ఠ వేసి ఉన్నారు. అలాంటి కోవకు చెందిన హిందూ పండితుల ప్రకారం -"మానవులు పుట్టుకతో అథికులు- అథములు అవుతారు!" అన్న తీర్మానం ఒకటి ఉంది.అయితే దానిని హిందూ శాస్త్రాలు అంగీకరిస్తున్నాయో లేక తిరస్కరిస్తున్నాయో ఈ క్రింది గమనించగలరు.
వేదం:
జనం మనుజాతం =
అందరూ మను (ఆది మానవుని) సంతానం - ఋగ్వేదం 1:45:1
అజ్వేష్ఠాస: ఆకనిష్ఠాస: ఏతే భారత: =
కొందరు పెద్దలు లేరు, కొందరు చిన్నలు లేరు, వీరందరు పరస్పరం సోదరులే. ఋగ్వేదం 5:60:5
ఉపనిషత్:
ఆ ప్రజాపతి ఒంటరిగా ఉన్నందున తృప్తినొందలేదు. అందువలన ఒక్కటిగా ఉండి వాడు ఆనందించుట లేదు. అతడు రెండవ దానిని కోరెను. అప్పుడతడు స్త్రీ పురుషుల ఇరువురి జంట ఎట్లండునో ఆ రీతిగా నుండెను. అనగా తనని రెండు భాగములు (అర్ధాంగి)గా చేసుకొనెను. అపుడతడే సతీపతి అనే ఇద్దరు వ్యక్తులుగా మారెను.కాబట్టి మనుష్యుడు చీల్చిన వెదురు బొంగు వలె ఉన్నాడని యజ్ఞవల్క రుషి చెప్పి యున్నాడు.అందుచేత పురుషుని యందుండి ఈ అర్ధభాగము స్త్రీ చే పరిపూర్ణం చేయబడెను. అట్లు ఆ స్త్రీ పురుషుల వలన మనుష్యులు జన్మించెను. -బృహదారణ్యక ఉపనిషత్తు 3:4:3
క్రైస్తవ-ఇస్లాం థర్మ శాస్త్రాల ప్రకారమైతే మానవులంతా ఒకే జంట సంతానం. పైన పేర్కొన్న హిందూ శాస్త్రాల ప్రకారమూ మానవాళి యావత్తూ ఒకే జంట సంతానమని సుస్పష్టమవుతుంది. దీనిని బట్టి పుట్టుకతో ఒకరు "ఎక్కువ" మరొకరు "తక్కువ" అని ప్రకటించే హిందూ పండితుల ప్రకటనను హిందూ శాస్త్రాలు తిరస్కరిస్తున్నట్టే కదా! అంటే - జన్మత: ప్రజలు నిమ్నోన్నత స్థితులను కలిగి ఉంటారనేది కొందరు జాత్యాహంకారులు సృష్టించిన ఒక కాల్పనిక వర్గీకరణ మాత్రమేనని తెలుస్తుంది. (
Next Page.)