Posted by Sakshyam Magazine on Thursday, May 28, 2015
శాస్త్ర బోధనలు ఈరోజు నుండే కాదు ఎప్పటి నుండో మరుగున పడిపోయాలి.అమాయక ప్రజలు కల్పిత బోధనల వలన, నేనే దేవుణ్ణని చెప్పుకుంటున్న అనేక మాయదారి స్వామీజీల బారిన పడి మోస పోవడం, ఇంక అనేక మంది పండితుల మోసాలకు గురై పోవడం ఇవన్నీ నేను గమనించినప్పుడు భక్తి అంటే ఇలా ఒకరికొకరు మోసపర్చుకోవడం, గొప్పలు ప్రకటించుకోవడమేనా? ఉన్నవాళ్లకు ఒక రూటు, లేనివాళ్లకు ఒక రూటు ఇదేమి భక్తి అనిపించేది. ఈ మతం, భక్తి, దేవుడు అంతా ట్రాష్ అనిపించింది. వీళ్ల ఆగడాలకు మితి లేక నాస్తిక సమాజం ఉనికిలోకి వచ్చింది అనిపించింది. నిజానికి నాస్తికవాదం ఆస్తికత్వంలో నుంచే పుట్టుకొచ్చింది. ఈ పరిస్థితిలో భగవద్గీత తారసపడడం, దానితో పాటు బైబిల్, ఖురాన్ గ్రంధాలను అధ్యయనం చేయడం భగవద్ధేశ్చ్యగా జరిగిపోయింది. అప్పుడు నేను ధర్మ గ్రంధాలలో ఉన్న భక్తికిని, సమాజంలో నడుస్తున్న భక్తికిని ఏమాత్రం పొంతన లేదని తెలుసుకున్నాను.ఈరోజు సమాజంలో భక్తిని మనిషి అనుచరిస్తే మూర్ఖుడైపోతాడు. అహంకారి, దుర్మార్గుడు,విచక్షణ జ్ఞానం లేని మృగంగా మారిపోతాడు.అజ్ఞానిగా మారి చివరికి భక్తి పేరు చెప్పుకు జరిగే జాతరలలో గణేష్ నిమజ్జనం లాంటి పండుగలలో కూడా శరీరానికి బాగా సారా పట్టించి మత్తులో తూగుతాడు. కాని శాస్త్ర అనుచరణ మనిషిని జ్ఞానవంతుణ్ణి చేస్తుంది.భక్తి పేరు చెప్పుకు జిరిగే దారుణాలను అంతమొందిస్తుంది. మనిషి స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇటువంటి థర్మ శాస్త్ర ప్రబోధనలను గుర్తించిన నేను ఎలాగైనా శాస్త్ర బోధనలను సామాన్యులకు అందజేయాలి. థార్మిక శాస్త్రాలలో ఉన్న యధార్ధాన్ని ప్రజల ముందు పెట్టాలి. జ్ఞానవంతులను, చైతన్య వంతులను చేయాలి.అనుకున్నదే తడవు "సాక్ష్యం సంచలన పత్రిక"ను స్థాపించాను. ఇటువంటి తపన ఉన్న ఎంతోమంది హిందూ,ముస్లిం, క్రైస్తవ సమాజాలకు చెందిన వ్యక్తులు ప్రోత్సాహాన్ని అందించారు.అందిస్తూనే ఉన్నారు. అలాగే కొంతమంది నుండి కూడా బెదిరింపులు కూడా అందాయి. మంచి పని ఏదైనా విమర్శలకు గురవ్వడం సహజమే కదా? అదీ శాస్త్ర థర్మంలో అయితే మరీ దారుణంగా ఉంటుంది. అలనాడు ఎంతో మంది ప్రాణాలను కూడా వదులుకోవల్సింది వచ్చింది కూడా! వీటికి దేనికి సాక్ష్యం మేగజైన్ తలవంచదు.అంతా భగవంతుణ్ణి చాయలోనే జరుగుతుంది. దీని ద్వారా కనీసం వందమందిలో ఒక్కరైనా గ్రహిస్తే మా తపనకు ధన్యత లభించినట్లే .శుభం.