శుక్రాచార్య గారి ప్రశ్నలు :
అసలు విగ్రహారాధన అంత పెద్ద పాపం ఎందుకు అయ్యింది? ఇందు గలడందులేడని సందేహము వలదు ఎందెందు వెదికినా అందందే గలడు అనేది .. విస్వాసం. ఆ విశ్వాసం ప్రకారమే విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆ విగ్రహములో మాత్రం ఉండడా? అలాంటప్పుడు ఆ విగ్రహాన్ని పూజించడం తప్పా? దేవుడికి ఒక రూపం ఇవ్వడం అనేది మానవుల ఇష్టం. పురాణాలలో ఉన్న వర్ణణలను బట్టి ఆ విధంగా రూపొందిందించుకున్నారు. దేవున్ని తెలిసిన రూపాలలో కొలవడం వలన దగ్గరితనం పెరుగుతుంది. ఈ మాత్రానికి అదేదో పాపం అయినట్టు ఈ పంచాయితీలేంది? మీ మతములో విగ్రహారాధన నిషేధం అని చెబితే మీరు పాటించుకోండి అంతేకానీ, ఇతర మతాలది తప్పని..మీరు అదేదో ఉనంత మైన స్థానములో ఉన్నారని బ్రమపడకండి. అందరిది కేవలం నమ్మకం మాత్రమే.
M.A.అభిలాష్ గారి సమాధానములు :
శుక్రా
చార్య గారికి నమస్కారాలు!
మానవ
నిర్మితమైన ఏ చిన్న వ్యవస్థలోనైనా- దానివంటూ కొన్ని “కచ్చితమైన నియమ నిబంధనలు” ఒక వైపు
ఉంటాయి. అలాంటి సంస్థలలో పనిచేసే వారి కొన్ని “ఊహా జనితమైన భావాలు” మరొక వైపు ఉంటాయి.
ఒక సంస్థ సక్రమముగా సాగాలంటే- పైరెండిటిలో ఏవి పాటించబడాలి? అన్న ప్రశ్నకు మొదటివి పాటించబడాలనే మన
ఇంగితము సమాధానము ఇస్తుంది.
అలాగే
మన సర్వోన్నతుడైన ఏకైక సర్వేశ్వరుడు సృష్టించిన ఈ మహా భువన భాండములో జీవించే ఈ మనిషి
తన సృష్టికర్తతో కలిగి ఉండే సంబంధాన్ని తెలిపే “కచ్చితమైన నియమ నిబంధనలు” ఏమీ ఉండవా? అలాగే- ఒక మనిషి తన తోటి మనుషులతో ఎలా
ప్రవర్తించాలో తెలియజేసే- “కచ్చితమైన నియమ నిబంధనలు” ఏమీ ఉండవా? పై రెండు విషయాలలో ఎవరికి తోచిన “ఊహా జనితమైన
భావాలు” వారు కలిగి ఉండవచ్చా?
దీనికి “ఒక పద్ధతీ
ఒక పడికట్టూ ” అంటూ ఏమీ ఉండదా?
ఈ ప్రశ్నలకూ మన ఇంగితము ఇచ్చే సమాధానము- ఈ మహా వ్యవస్థాధిపతి అయిన ఆ సర్వేశ్వరుని ఆదేశిత “కచ్చితమైన నియమ నిబంధనలు”
ఉండాలన్నదే కదా!
అయితే
నేటి అధికశాతం మతావలoబికులు- ఈశ్వర ప్రోక్త “కచ్చితమైన నియమ నిబంధనల”ను కేవలము శ్రావ్యమైన
పఠనానికి మాత్రమే పరిమితంచేసి,
ఆ యా పండితుల ఆ యా
“ఊహా జనితమైన భావాల”ను ఈశ్వర ప్రోక్త ఆదేశాలుగా ప్రచారం చేస్తున్నారు. వారి ఆ ప్రబోధనలలో
తమకు లాభాలు వచ్చిపడే కార్యాలే ఉంటాయి తప్ప, సామాన్య ధార్మిక ప్రజలలో “నైతికత-ఐక్యత”’ల వంటి విలువలను పెంచే ప్రేరకాలు ఏమీ ఉండవు.
అయితే సామాన్య అమాయిక ప్రజలు అవన్నీ ఈశ్వర ప్రోక్త సత్యాలని “భ్రమిస్తున్నారు”. మత అవలంబికుల
ఈ పోకడే- ప్రపంచ వ్యాప్త “అనైతికత-అనైక్యత”’ల వంటి మహా సంక్షోభాలకు, మానవాళి జీవితం కుక్కలు చించిన విస్తరిగా
మారిపోవటానికి ప్రధాన కారణం అయ్యింది!
ఎందుకంటే-
ఈ పండిత వర్గం సామాన్యులను ధర్మశాస్త్రాలను చదవనివ్వరు. వాటిని చదవటం మా జన్మహక్కు
అని భావిస్తూ,
వాటిని అర్థం చేసుకోవటం
మీకు అసాధ్యమని ప్రజలకు తప్పు దోవ పట్టిస్తూ ఉంటారు. దీని వలన- నేతి బీరకాయలో “నెయ్యి”
లేనట్లే, నేటి మన ధార్మికులలో “ధర్మము” లేకుండాపోయింది!!
ప్రతి
ధార్మిక వర్గపు పతనానికీ మూల కారణం- “శాస్త్రాల ధర్మము”ను విడనాడి, “శాస్త్రుల ధర్మము”ను అనుసరించటమే! కనుక
ఏ ధార్మిక వర్గము బాగుపడాలన్నా అది - “శాస్త్రుల ధర్మము”విడనాడి, “శాస్త్రాల ధర్మము”ను చేపట్టాలి! అంతవరకూ
ధార్మిక వర్గాలకు పట్టిన “అధర్మపు జాడ్యము” వదలదు.
లేనియడల-
మన గుళ్ళూ-గోపురాలూ-మన చర్చీలూ-మసీదులూ ఒకవైపు- “భక్తుల”తో కిటకిటలాడుతూ ఉంటాయి! అచ్చం
అలాగే మరోవైపు- మన జైళ్ళూ “నేరస్థుల”తో కిటకిటలాడుతూ ఉంటాయి!!!
శుక్రా
చార్య గారూ! మీరు- “విగ్రహాలను పూజించటం తప్పా? దేవుడికి ఒక రూపము ఇవ్వటం అనేది మానవుల
ఇష్టం” అని తీర్మానించేశారు. ధార్మికముగా మీరు చేసిన ఆ తీర్మానం చాలా తీవ్రమైన నేరము.
అదే విషయాన్ని వేదం నుండో,
ఏ ఉపనిషద్ నుండో, గీతాశాస్త్రం నుండో కనీసం ఒక్క మంత్రమో, శ్లోకమో పేర్కొని ఉంటే మీ తీర్మానం సత్యమయ్యేది!
ఈమాత్రం
దానికి ఈ పoచాయితీలేంది?
అని కూడా ఆగ్రహంతో
ప్రశ్నించారు. ఈ క్రింది మంత్రాల-శ్లోకాల అవగాహన మీకు ఉంటే, మీరు అలా పశ్నించి ఉండేవారు కాదు.
విషయమును ధ్యానించు పురుషుని యొక్క మనస్సు విషయమందే
రమించును. నన్ను (సర్వేశ్వరుని) స్మరించుట వాని చిత్తము నా (సర్వేశ్వరుని)
యందే లీనమగును. యోగశిఖోపనిషత్ 3:6
శుక్రా
చార్య గారూ! “శాస్త్రి”గారైన మీరు- “దేవుని తెలిసిన రూపాలలో కొలవడం వలన దగ్గరితనం పెరుగుతుంది”. అని అంటూన్నారు. కానీ “విషయము (విగ్రహము) ను ధ్యానిస్తే మనస్సు
దేవునిపైకి వేళ్ళక విషయము (విగ్రహము) నే ఉండిపోతుంది”
అని “శాస్త్రం” చెబుతుంది. ఎవరి మాట వినమంటారో మీరే శెలవియ్యండి శుక్రా చార్య గారూ!
పర
దేశములో ఉన్న భర్త చిత్రపటం లేనప్పుడు, ఒక
భార్య అతడిని తనకు నచ్చినోడి ఫోటోలో చూచుకొనవచ్చును అన్నట్లు ఉంది మీ ఉపమానము! రోషమున్న
ఏ భర్త అయినా దానిని సహిస్తాడా శుక్రా చార్య గారూ! లేదు కదా! తెంపితే తెగిపోయే అల్పమైన
తాళిని కట్టినోడు తనను తన భార్యా మనస్సులో కాక పరాయి ఫోటోలో చూస్తే, అది మానసిక వ్యభిచారముగా తీర్మానిస్తాడు
కదా! భర్త (ప్రభువు) లకే భర్త (ప్రభువు). అయిన ఆ సర్వోన్నత భర్త (ప్రభువు) అయిన ఆ సర్వేశ్వరుడైన
ఈ క్రింది శ్లోకములో గమనించగలరు.
నన్ను వ్యభిచరించని ప్రేమతో ప్రేమించుచూ వ్యభిచరించని భక్తితో
సేవించుచూ ఎవడు నన్ను బడయ ప్రయత్నించునో (అతడు) చెడు
గుణములనునతిక్రమించును. మరియు అతడు సైతము బ్రహ్మ(పవిత్రుడు)
అగుటకు సమర్ధుడగును. -14:26 (శ్రీ గీతాయోగము)
దీనిని
బట్టి- గీతాశాస్త్రం ప్రకారం- బహుదైవోపాసన లేక విగ్రహారాధన “అధ్యాత్మిక వ్యభిచారము!”
అని అర్థం కావటం లేదా శుక్రా చార్య గారూ! ఈ అధ్యాత్మిక వ్యభిచారులైన వారిగతి ఏం కానుందో
ఈ క్రింది శ్లోకములో గమనించగలరు.
ఆ పరమసత్త ఈ జగత్తును ఎంతో ఆక్రమించుకొనియున్నది. దానికి రూపం లేదు,
శోకము లేదు. దీనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.ఇతరులందరూ
దు:ఖాన్ని అనుభవించాల్సిందే. శ్వేతాశ్వతరోపనిషత్త్ -3:10
ఎవరైతే ప్రాకృతిక వస్తువులను (గాలి,నీరు మొ//వాటిని) ఉపాసిస్తారో
వారు చీకటి (నరకం)లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి (సృష్టితాలు -
మానవునిచేత తయారయ్యే వస్తువులను,బొమ్మలను) ఉపాసిస్తారో వారు
మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు. -యజుర్వేదం 40:9
పై మంత్రాలలో గమనార్హ వాక్యాలు- “దు:ఖము” మరియు అంధకారము” అన్నవి నిత్యనరక శిక్షలకు పరియాయ పదాలు. దీని ప్రకారం- బహుదైవోపాసన లేక విగ్రహారాధన చేసేవారు
“నరకానికి పోతారు!” అని స్వయంగా హిందూ శాస్త్రాలే ఘోషిస్తున్నాయి కదా! ఇప్పుడు ఆర్థమయ్యిందా
శుక్రా చార్య గారూ! విగ్రహారాధన ఎంతపెద్ద పాపమో!? ఈ పంచాయితీ ఎందుకో!!??
మీ
మా అనే భేదాలతో మాటలాడటం ఇక పాత మాట అయిపోయింది! ధర్మం ప్రకారం మనమoతా ఒక్కటే- భగవద్గీత
హిందువులదీ, బైబిలు క్రైస్తవులదీ, ఖురాన్ ముస్లిములదీ అన్న ప్రచారము అత్యంత
విష తుల్యమైనది! ఇది మానవాళిని ముక్కలు ముక్కలుగా చేసి, తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవటానికి కొందరు
స్వార్థ పరులు చేస్తున్న ప్రచారం మాత్రమే! ఈ మూడు గ్రంధాలే కాక, వాటి దృక్పథాన్నే కలిగిన ఇంకా కొన్ని గ్రంథాలున్నాయి.
సూర్య-చoద్రులూ,
గాలీ-నీరూ మరియు
సమస్త ప్రాకృతిక వనరులన్నీ ఏ విధముగా మనందరి ఉమ్మడి ఆస్తి అయి ఉన్నదో అలాగే- ఈ సకల
ధర్మశాస్త్రాలూ మనందరి ఉమ్మడి ఆస్తి అయి ఉన్నాయి. కనుక ఏ ధార్మిక వర్గం వారైనా తమ వద్ద
ఉన్న ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాటలాడినా ప్రశ్నించే హక్కును మరొక ధార్మిక వర్గం
కలిగి ఉంటుందన్నది పరతి ఒక్కరూ గుర్తించాలి! గతంలో అంటే- ఈ ధర్మశాస్త్రాల ప్రబోధనలను
దాచి పెట్టారు. కనుక ఈ వాస్తవం ఎవరికీ తేలియకుండా పోయింది. ఇది సమాచార యుగం కనుక వాటి
ప్రబోధనలను దాచి పెట్టటంగాని,
వాటిని వక్రీకరించి
బోధించటంగాని అయ్యేపని కాదు. కాబోదు!!
“మీ
మతంలో విగ్రహారాధన తప్పైతే మీరు పాటించుకోండి” అని మీరు ఉచితసలహా ఒకటి పడేశారు!
ఇప్పుడు
మేము, హిందూ పండితులు అయిన మీకు, అలాగే క్రైస్తవ పడితులకూ ముస్లిం పడితులకూ
కలిపి ఒక సలహా ఇస్తున్నాము దయచేసి, జాగ్రత్తగా
గమనించగలరు- మీరు ఒక పండితునిగా ప్రజలతో ఏది చెప్పదలచినా అది ధర్మ శాస్త్రాల ఆధారాలతోనే
చెప్పగలరు! ఊహాజనితమైన విషయములను చెప్పటం మానేయగలరు. లేదు మేము వాటిని మానలేము అనుకుంటే-
ధర్మ శాస్త్రాలను వదలివేయండి! ఎందుకంటే- ఒకవైపు హిందూ-ముస్లిం-క్రైస్తవ అన్నార్తులు
గుప్పెడు అన్నం కొరకు,
దాహార్తులు గుక్కెడు
నీళ్ల కొరకు,
కనీస జీవిత అవసరాలు
తీరక, కోట్లాది మంది అలమటిస్తూ అసువులు
బాస్తుంటే, మరొకవైపు మీరు ధర్మం పేరిట చేసే- అశాస్త్రీయ, హేతురహిత, నిరర్ధక, వ్యర్థ , అర్థరహిత చేష్టలను, అవసరానికి మించి ఆలయాలకు, దర్గాలకు, మసీదులకు , చర్చీలకు కోట్లాది రూపాయలను ధారబోయిస్తున్నారు!
ఇంకా దేవుని పెళ్ళిళ్ళపేరిట,
దేవుని ఊరేగింపుల
పేరిట, తీర్థాల, ఉరుసుల, క్రిస్మస్-ఈష్టర్ల పేరిట కోటానుకోట్ల రూపాయల
వృథా ఖర్చుల ఈ ప్రహసనం ఏమిటి?
ఇవన్నీ చేయాలని లేదా
కనీసం వాటిలో ఏదో ఒకటి చేయాలని ఒక్కగాని ఒక్క ఆధారాన్ని హిందూ-క్రైస్తవ-ముస్లిం పండితులలో
ఎవరయినా గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాలలో ఎప్పటికైనా చూపగలరా? ఇది హిందూ-క్రైస్తన-ముస్లిం పండితులకు
మాతరఫున “జీవిత పరియంత సవాలు” (LIFE
TIME CHALLENGE)!! కానీ, ఎప్పటికీ చూపలేరు!
అయితే, ఆ యా మత వర్గాల పండితులు ధర్మ శాస్త్రాలను
వల్లిస్తూ అవన్నీ చేస్తున్న కారణంగా ఆ వ్యర్ధ పనులు ధర్మ శాస్త్రాలలో ఉన్నాయనుకొని
ఆలోచనాపరులూ మేధావులూ ధర్మ శాస్త్రాలను అస్యహించుకుంటున్నారు. దీని వలన పండితులకు రెండు
పాపాలవుతున్నాయి. వాటిలో ఒకటి- శాస్త్రాలను ఆచరించని పాపము. ఆ శాస్త్రాలను తమ చేత పట్టుకొని
వాటికి వ్యతిరేక చేష్టలు చేస్తున్న కారణంగా వాటికి వివేచనాపరులు దూరమయ్యే పాపము! శుక్రా
చార్య గారూ! మా ఈ విషయాలపై ప్రశాంత చిత్తంతో ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమ పూర్వకముగా
కోరుతున్నాను. ఇక,
మీదట మీరు ఏది చెప్పాలనుకున్నా
ధర్మశాస్త్రాల ఆధారాలతోనే చెప్పాలన్నది మరచిపోరు కదా!