Posted by Sakshyam Magazine on Saturday, October 24, 2015
క్రైస్తవులను చూస్తుంటే మనకి గొర్రెలను చూసినట్టే అనిపిస్తుంది. అయ్యగార్లు, అమ్మగార్లు అని పిలిపించుకునే ఈ పాస్టర్లకు ఏది తోస్తే అదే వేదంగా చర్చి సభ్యుల చేత నమ్మిస్తూ ఉంటారు. ఎంత మాయ స్వయంగా యేసే వీరి కలల్లోకి వచ్చి తమ సభ్యుల బాగోగులు మరీ అడిగి వెళ్తుంటారు. విచిత్రం ఏమిటంటే ఆయన (యేసు) గారు మాత్రం పాస్టర్ల దగ్గరకు వెళ్తారు గాని తమ భక్తుల కలలలోకి మాత్రం రారు.
నాకు ఈ క్రైస్తవుల నమ్మకాలు, మాటలు, పనులు కడు విచిత్రంగా ఉంటాయి. వీరి దృష్టికి హిందువులు ఆన్యులంట! ఇంకా అవిశ్వాసులునూ, విగ్రహారాధికులునూ. వీరి పెట్టినది తినే విషయంలో గాని, వీరి నమ్మకాలుగానీ ఏమాత్రం పట్టించుకోకూడదు. ఎందుకంటే వీరు (హిందువులు) ఆన్యులునూ, ఏమీ తెలియని అమాయకులునూ.
మరి వీరు చేసేది ఏమిటో వీళ్లకే తెలియదు. కానీ క్రైస్తవులవడమంటే స్వర్గవాసులమన్నట్టు ఫీలయిపోతారు. నిజం చెప్పాలంటే వీరికి గాని, ఈ చర్చి పాస్టర్లకు గాని అసలు బైబిలంటే ఏమిటో తెలియదు.
వీళ్ళకు యేసు దేవుడు? గాని బైబిల్లో యేసుకు, భూలోక వాసులందరికీ యెహోవా దేవుడు.
వీళ్ళు మన పాపం కోసం యేసు శిలువ పై చనిపోయేడని నమ్ముతారు. నమ్మబలికిస్తారు. కాని బైబిల్లో యేసు శిలువపై చనిపోలేదని దేవుడే ఆయనను కాపాడుకున్నాడని ఉంది. వీళ్లదంతా మాయ బోధ. పాపం అమాయక క్రైస్తవులు వీరికి బలవుతూనే ఉన్నారు.
తండ్రి దేవుడు,యేసు దేవుడు,పరిశుద్ధాత్మ దేవుడని,ముగ్గురూ కలిపి దేవుడని, త్రిత్వమని ఇలా పిచ్చి,పిచ్చి బోధనలు చేస్తూ ఉంటారు. ఇవ్వన్నీ బైబిల్లో ఎక్కడా కానరావు. భూతద్ధం వెతికి చూసినా కనిపించవు. అంతా మాయ బోధ. ఒకప్పుడు బ్రతకలేనోడు బడి పంతులనేవారు. ఇప్పుడు బ్రతకలేనోడల్లా నాలుగు బైబిల్ వాక్యాలు పట్టుకుని పాస్టర్లు అయ్యిపోతున్నారు. యేసు వారు " వీరూ పరలోకం వెళ్లరు. వెళ్ళేవారిని వెళ్లనివ్వరు" అని వీరి గురించే చెప్పారు. అప్పుడు శాస్త్రులకు, ఇప్పుడు పాస్టర్లకు అంతే తేడా!
మరొక విచిత్రం ఏమిటంటే వారం,వారం సంస్కారాలు, కష్టపడి తెచ్చుకున్న దాంట్లో పదియవ వంతు దోచుకుంటారు. బియ్యంలోనూ, తొలి కోడిపెట్ట, తొలి కోడిగుడ్డులోనూ వీరికి వాటాలే. మాయ చేయడానికి వారికి సిగ్గు లేకపోతే, ఈ చర్చి సభ్యులకు సిగ్గు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు, మోసాలు ఉన్నాయి. ఈ పాస్టర్ల ఆగడాలు ఇంతా,అంతా కాదు. వీళ్ళను గ్రుడ్డిగా ఫాలో అవుతున్న ఈ అమాయక క్రైస్తవులను నిజంగానే గొర్రెలనాలి.