Posted by Sakshyam Magazine on Thursday, November 23, 2017
హిందువులు క్రైస్తవులను చూసైనా నేర్చు కోవాలి. వాళ్ల ఇంట్లో నలుగురు సభ్యులుంటే చాలు నాలుగు బైబిల్లు ఉంటాయి. కానీ హిందువులని చెప్పుకునే మన వాళ్ళు మాత్రం ఒకసారైనా భగవద్గీతను చదవడం మాట అటుంచి కనీసం చూసిన దాఖలా కూడా కలిగియుండరు.
ఎప్పుడు చూసినా భక్తి పేరుతో వస్తున్న పనికిమాలిన సినిమాలు, సీరియల్స్ మాత్రం చూసేసి ఇదో పెద్ద పుణ్యకార్యం అన్నట్టు ఫీలయ్యిపోతారు. నిజానికి ఈరోజు హిందూ శాస్త్రాలు హాస్యాస్పదంగా మారిపోవడానికి సగం కారణం ఈ సినిమాలే. ఏదో యమలోకం పోయి అక్కడి యమపాలకుడైన యముడ్ని ముప్పతిప్పలు పెట్టినట్టు, స్వర్గలోకపు కన్యలతో ఎంజాయ్ చేసినట్టు చిత్రీకరిస్తుంటే కల్లప్పగించి చూస్తూ ఆనందపడిపోతామే తప్ప ఏనాదైనా ఇది హిందూ శాస్త్రాలను,సిద్ధాంతాలను అవమాన పర్చడమని ఖండిచామా? లేదే! మనకెందుకొచ్చిందన్న గొడవ అనుకుంటాము.
శాస్త్ర నిషిద్ధమైన కర్మలను బోధిస్తున్న దొంగ స్వాములను మాత్రం దేవుణ్ణిగా చేసుకుని ఆత్మ సాక్షాత్కారం,మోక్ష సిద్ధి దొరికేసినట్టు తెగ ఆనందపడిపోతాము. కనిపించిన ప్రతి పుట్టను,రాయిని మొక్కుతూ పోతామే గాని ఇది ఎంతవరకు శాస్త్ర సమ్మతమని మాత్రం ఆలోచించము. హిందూ శాస్త్రాల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోము, పఠనమును ప్రారంభించము.
దీనికారణంగానే హిందువులందరినీ క్రమేపీ క్రైస్తవ్యం ఆక్రమించేస్తుంది. చాప క్రింది నీరులా వ్యాపించివేస్తుంది. ఇలాగే జరిగితే కొన్నాళ్లకు ప్రతి ఇంట్లో భగవద్గీత బదులు బైబిల్ (క్రైస్తవులు) ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రతివక్కరికీ హిందూ శాస్త్రాల యొక్క గొప్పతనాన్ని అవగతపరచాలి.
కోట్లు,కోట్లు దొంగ స్వాముల ఆశ్రమాలకు ధారబోసే బదులు భగవద్గీతలను పంచి పెట్టినా గొప్ప పుణ్యం దక్కుతుంది. ఆ పని మాత్రం చేయము. స్వాములకు పెద్ద,పెద్ద దానాలు చేసుకుని, గుళ్లను అవసరం లేకపోయినా శృంగారించుకోవడం, భక్తి పేరు చెప్పుకుని చెలామణీ అవుతూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంటి ప్రక్కన ఆకలితో ఉన్న వాడి ఆకలి తీర్చకుండా హుండీలో లక్షలు వేస్తే ఉపయోగమేముంది చెప్పండి?
కందుకూరి వారు ఒక మాట అన్నారు.
"గుళ్ళు కట్టించి దానికి పాళ్ల రాయిలు వేయిస్తారు గాని, దాని ప్రక్కనే పూరి గుడిసెలో ఉండే పేదవాడికి మాత్రం తాగడానికి గంజినీళ్లు కూడా పోయరు ఇది భక్తా? అని అడిగారు. ఆయన మాట వాస్తవం కాదంటారా?
ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ప్రతి ఇంట్లో భాగవద్గీత ఉండేలా ప్రయత్నించాలి. శుభమ్!