Posted by Sakshyam Magazine on Tuesday, November 20, 2018
ఈ మధ్యకాలంలో ఎక్కువుగా గోవధ నినాదం వినబడుతోంది. తినకూడదని హిందువులు (ఇక్కడ హిందువులు అనే కంటే రాజకీయ వర్గాలు, లేక కొన్ని మతపరమైన సంస్థలు అంటే బాగుంటుందేమో! ఎందుకంటే హిందువులలో కూడా గోమాంసం తినే వారు ఎక్కువగానే ఉన్నారు.) ఇక మరోపక్క ముస్లింలు వాదులాడుకుంటున్నారు. మొన్నా మధ్య పరిపూర్ణానంద స్వామివారు మాంసాహార నిషేధం శాస్త్రాలలో లేదు అని చెప్పారు. అంటే దైవ దృష్టిలో మాంసాహార నిషేధం లేదన్నమాట. మనిషిని సృష్టించిన దేవునికి తెలియదా? ఏది తినాలో,ఏది తినకూడదో? అందుకే కాబోలు మనుస్మృతిలో పంది నిషేధం ఉంది. అంటే దానిని తినకూడదు. ఆవులు,గుఱ్ఱాల నిషేధం లేదు వేదంలో! ఆనాటి రోజుల్లో యాగాలలోనూ,యజ్ఞాలలోనూ వాటిని బలిచ్చిన దాఖలాలు ఎన్నో వున్నాయి. కాబట్టి దాశరధి రంగాచార్య గారన్నట్టు నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదం తప్ప వేద నినాదం కాదని ఆయన తేల్చి చెప్పేశారు.
మనుషులకీ, ఇతర జీవరాసులకీ మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. జీవరాసులలో కేవలం మాంసాహారం తినేవి ఉంటే, మరొక ప్రక్క కేవలం శాఖాహారం మాత్రమే తివేవి ఉంటాయి. అందుకే వాటి దంతాల ప్రక్రియ కూడా వేరు,వేరుగా ఉంటుంది. కాని మనిషి పూర్తిగా వేరు. మాంసాహారి,శాఖాహారి అయ్యుంటాడు. అందుకే మనిషి యొక్క పళ్ళ వరస కూడా రెండింటికీ అనుకూలంగానే ఉంటుంది.
ఇవేవీ అర్ధం చేసుకోకుండా మనం ఏదైతే తింటూ బ్రతుకుతున్నామో వారినీ అదే తిని బ్రతకాలంటే దారుణం కదూ? ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయ్. వారి కడుపుని శాసించాలని చూడడం అన్యాయం.
ఇక నన్ను గోవధ నిషేదాన్ని సమర్ధించరా? అని అడిగితే నేను 100% ఏకీభవిస్తాను. పూర్తిగా సమర్దిస్తాను. ఎందుకంటే కొన్ని జంతువులు మాంసం కంటే అవిచ్చే పాలు ఎక్కువుగా ఉపయోగపడతాయి. అటువంటి జీవులు అంతరించి పోకుండా కాపాడడం మనధర్మం. అందుకే ఆవులను శ్రీకృష్ణులవారు కాపాడినట్టు, ఒంటెలు అంతరించి పోకుండా ప్రవక్త ముహమ్మద్ వారు కాపాడినట్టు మనం చూడగలం.అంతే గాని మాంసాహార నిషేధాలు వారేమీ విధించలేదు.
ముస్లింలు గమనించవలసింది ఏమిటంటే
ప్రవక్త ముహమ్మద్(స)వారు గోవును ఖుర్భానీ చేసినట్టు ఎక్కడా ఒక్క దాఖలా లేదు. సరికదా గోవు మాంసం తిన్నట్టు కూడా ఆధారాలు లేవు. ఇంకా ఆయన గోవు పాలల్లో ఆరోగ్యం ఉంది, నెయ్యిలో వ్యాధి నివారణ ఉంది, మాంసంలో వ్యాధి ఉందని చెప్పారు. కాబట్టి ఒక వర్గానికి ప్రవిత్రమైన వాటిని గౌరవించడమే మంచి పని. ఆవును ఖచ్చితంగా తినాలని గాని, ఖుర్భానీ ఇవ్వాలని గాని ఎక్కడా లేదు. కేవలం ఆవును ఇవ్వక పోవడం వలన వచ్చే పాపమూ లేదు. వేరే ఎన్నో గొర్రెలూ, మేకలూ ఉన్నాయి. వాటిని ఇచ్చుకోవచ్చు. మొత్తం మాంసాహారమే నిషేధమంటే అది వేదం వ్యతిరేకమూ, మూర్ఖత్వమూ అవుతుంది. మాంసాహారం అవసరం కూడా! మనిషికి శాఖాహారంలో ప్రోటీన్లు ఉన్నటే, మామ్సాహరంలోనూ ఉన్నాయి అయితే వాటికి పరిధులూ, హద్దులూ ఉంటాయ్.
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in