Posted by Sakshyam Magazine on Friday, October 6, 2017
నిజానికి ప్రపంచ జనాభా కంటే దేవుళ్లు జనాభా ఎక్కువ. మనిషికో దేవుడు, ఇంటికో దేవుడు, ప్రతి ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి వివిధ రకరకాల దేవుళ్లు ఉన్నారు. నేను వీళ్లనెవరినీ దేవుళ్ళుగా నమ్మను. పుణ్యపురుషులుగానూ, మహానుభావులుగానూ ఆదర్శ మూత్రులుగానూ మాత్రమే నమ్ముతాను. అయితే నేను నమ్మే దేవుడు మాత్రం ఈ విశ్వానికి, ప్రపంచానికి సంబంధించినవాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకు జననమరణాలు లేవు. అవి ఉన్నవాడు దేవుడూ కాదు.
మతానికి ఒక దేవుడుంటే ఆమతం వారికి మాత్రమే భూమి ఏర్పడి ఉండాలి. వర్షం వారి ప్రాంతాలలోనూ,పొలాల్లోనూ కురవాలి. వారికో సూర్యుడు, చంద్రుడూ ఉండాలి. ఇవేవీ లేవు కదా? అంటే మతానికో దేవుడు లేదు. అన్ని మతాల వారికి, అన్ని దేశాల వారికి ఒకడే దేవుడున్నాడు. ఆయనే యూనివర్షల్ గాడ్!
ఇవేవీ అర్ధం చేసుకోకుండా ఎవరి దేవుడు వారికే అని వాదించడం పరమ మూర్ఖత్వం.
ఈమధ్య ఒకాయన తన బ్లాగులో హిందువుల దేవుడికీ, క్రైస్తవుల దేవుడికీ, ముస్లీముల దేవుడికి సంబంధం లేదని వ్రాసారు. ఇది ఆయన నమ్మకాల ప్రకారం కరెక్టే . ఎందుకంటే హిందువుల దేవుళ్లు రాముడూ,కృష్ణుడూ, ఇతర మహానుభావులు దేవుళ్ళయితే, క్రైస్తవుల దేవుళ్లు యేసు,మరియమ్మ అయితే, అలాగే ముస్లీముల దేవుళ్లు బాబాలు, దర్గాలు అయితే ఆయన చెప్పింది 100% నిజం.
కాని పై మత వర్గాలు పఠించే ఆయా ధార్మిక గ్రందాల ప్రకారం వారు నమ్మే మహానుభావులు ఆదర్శనీయులుగానే ప్రకటించాలి గాని దేవుళ్ళుగా తీర్మానించకూడదు. ఎందుకంటే ఆ గ్రంధాలన్నీ కేవలం సర్వోన్నతుడైన ఆ సర్వసృష్టికర్త గూర్చి మాత్రమే తెలియజేసాయి. నేను ఆయననే నమ్ముతాను. ఆయన అందరి దేవుడు.
@K.S.Chowdary (Sakshyam Magazine Editor)