-42:30وَ مَاۤ اَصَابَکُمۡ مِّنۡ مُّصِیۡبَۃٍ فَبِمَا کَسَبَتۡ اَیۡدِیۡکُمۡ وَ یَعۡفُوۡا عَنۡ کَثِیۡرٍ ﴿۳۰﴾
మీపై ఏ ఆపదలొచ్చిపడినా, అవి మీ చేజేతులారా చేసుకున్న చేష్టల పర్యవసానమే…!
Whatever misfortune befalls you, it is because of what your hands have earned; and yet He pardons much.
NRC
ముస్లిం పెద్దల
స్వయం కృతాపరాథం!
ముందు మాట
నేటి అధిక శాతం ముస్లిములు అనేక సమస్యల సుడిగుండంలో పడి సతమతమవుతున్నారు. దానికి గల ప్రధాన కారణాల్లో...
1. '
ధర్మ అనుసరణ' అంటే '
ఇత్తెబాయె దీన్' (2:208), '
సమాజ సంస్కరణ' అనగా '
ఇషాతె దీన్' (3:110) అనే ఈ రెండు కార్యాల్లో వెనుకబడటం. పర్యవసానంగా అల్లాహ్ కారూణ్యానికి దూరమయ్యారు.
2. ఇస్లాములో ఉన్న అభ్యూదయ వాదాన్ని తిరస్కరించటం. దీని వలన ఆధునిక విద్యా, వైజ్ఞానిక రంగాల్లో వెనుకబడిపోయారు.
3. అధికారం ద్వారా ధర్మాన్ని శక్తివంతంగా స్థాపించవచ్చనే అందమైన అపోహకి గురై, ఇస్లామ్ను తీవ్రవాద వ్యవస్థగా మార్చటం. దీనివలన 'స్వచ్చమైన ఇస్లామీయ వ్యవస్థ'కి, 'కుటిల రాజకీయ వ్యవస్థ'కి మధ్య ఘోరమైన ఘర్షణ రాజుకుంది.
4. 'స్వజాతీయ' అనువంశిక గుర్తింపులు చెరిపి, 'పరజాతీయ' అనువంశిక గుర్తింపులను తగిలించటం. దీని వలన ముస్లిమేతర దేశాల్లో ఉన్న ముస్లిములు, స్వజాతీయులైనప్పటికీ పరజాతీయులుగా పరిగణించబడే దుఃస్థితి దాపురించింది.
ఈ వ్యాసం- 'జాతీయ, సాంస్కృతిక గుర్తింపులను మార్చివేయటం - దాని పర్యవసనాలు - పరిష్కారాలు' అన్న అంశంపై సాగింది. ఈ రోజు ముస్లిములు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య- తమ జాతీయతను నిరూపించుకోవటం (NRC). ఇది అత్యంత దౌర్భాగ్య పూరిత సమస్య! భారతీయ ముస్లిములు ఇంతటి దుఃస్థితికి గురి అయ్యారంటే వారి పెద్దలు అల్లాహ్ దృష్టిలో ఏదో ఘోరమైన నేరానికి పాల్పడి ఉంటారన్నది వాస్తవం. అదేమిటో తెలుసుకోవాలంటే మీరు ఈ వ్యాసాన్ని అధ్యయనం చేయవలసిందే!
జాతులు, సమూహాల ఉత్థానపతనాల్ని బేరీజువేసుకోవలసిన సందర్భం వచ్చిన ప్రతిసారి, వాటికి గల కారణాల్ని ముందు అణ్వేషించాల్సి ఉంటుంది. ఆ అన్వేషణ అత్యంత నిజాయతీగా నికార్సుగా జరపాల్సి ఉంటుది. అన్వేషణలో; పనికిమాలిన సిద్ధాంతాలు, చాందస వాదాలు, చాదస్తపు విలువలు, కుతర్కం మనల్ని వెనక్కి లాగొచ్చు. అయినాగాని, మనం వాటికి లొంగటానికి వీల్లేదు. ఎందుకంటే, జాతులు, సమూహాల ఉత్థానపతనాలే కాదు, వాటి భవిష్యత్తును కూడా నిర్ణయించేది ఈ అన్వేషణే!
ముస్లిం సమాజం గురించి, అలాంటి అన్వేషణే నేనూ చేస్తున్నాను. ఇందులో నేను సూత్రీకరించిన పరిశోధనాత్మక విషయాలు మీకు నచ్చకపోవచ్చు, మీ కోపానికి, ఆగ్రావేశాలకి కారణం కావచ్చు. ఒచోట ఏకోశాన మీకవి మింగుడుపడకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆగి నిలబడి ఆలోచించండి.
ఆంతర్యాలను ఎరిగినవాడు అల్లాహ్. కనుక నా చిత్తశుద్ధిని శంకించవద్దని కోరుతున్నాను. నా వాదన ఖురాన్-హదీస్ ఆధారాలతో ప్రవేశ పెట్టాను. ఒకవేళ అది తప్పని మీరు భావిస్తే , మీరూ ఖురాన్-హదీస్’తోనే మీ వాదనను ప్రవేశ పెట్టాలని కోరుతున్నాను.
ముస్లిములపై వచ్చి పడుతున్న ఆపదలు, అల్లాహ్ పెట్టే పరీక్షలా? లేక అల్లాహ్ విధించే శిక్షలా?
భారతీయ ముస్లిములపై వచ్చి పడుతున్న ఆపదలు పరీక్షలా? లేక శిక్షలా? అన్నది ముందు తేల్చాలి. ఎందుకంటే, ఇది వైద్యానికి ముందు చేసే ‘రోగ నిర్థారణా పరీక్ష’ లాంటిది. ఇది ఎంత కచ్చితం (Accurate)గా ఉంటుందో వైద్యం అంత విజయవంతం (Successful) అవుతుంది. ఈ విషయాన్ని నిర్థారించటానికి ముస్లిం పెద్దలు నేటికీ ప్రయత్నించటం లేదు. ఇంతకీ నేటి ముస్లిములు ఎదుర్కొనేవి: అల్లాహ్ పెట్టే పరీక్షలా? లేక అల్లాహ్ విధించే శిక్షలా? అన్నది ఎలా కనిపెట్టాలి?
ముస్లిములు ‘దైవ హక్కులు’, ‘మానవ హక్కులు’ సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పటికీ, వారిపై ఆపదలు వస్తుంటే అవి- ‘పరీక్ష’లవుతాయి. వాటి ‘నిర్వర్తన’లో ముస్లిములు ‘నిర్లక్ష్యం’ చేస్తున్నప్పుడు వారిపై ఆపదలు వస్తుంటే అవి- ‘శిక్ష’లవుతాయి. పైరెండు విషయాల్లో ముస్లిం సమాజం వెనకబడి ఉంది. కనుక అది ఎదుర్కొంటున్నది- అల్లాహ్ ‘శిక్ష’యే గాని ‘పరీక్ష’ కాదు!
‘మూల కారణాలు’, ‘పరిణామాలు’ అనే రెండు వేర్వేరు విషయాలు ఉంటాయి. సమస్యలను విజయవంతంగా పరిష్కరించదలిస్తే, పరిణామాలపై ఏకరువు పెట్టటం పూర్తిగా మానేయాలి. మూల కారణాలను కనిపెట్టి, వాటిని పరిష్కరించాలి. తద్వారా సమస్యలు వాటికవే పరిష్కారమైపోతాయి. ‘మూల కారణాల’పై మాట్లాడటం పుండును ‘శస్త్ర చికిత్స’ చేసి, తొలగించటం లాంటిది. ఇది ‘చాలా నొప్పి’గా ఉంఉండొచ్చు కానీ, ‘రోగాన్ని శాశ్వతంగా అంతం చేస్తుంది’. ‘పరిణామాల’పై మాట్లాడటం పుండుపై ‘లేపనం’ అద్దటం లాంటిది. ఇది ‘చాలా హాయి’నిస్తుంది కాకపోతే, ‘రోగిని శాశ్వతంగా అంతం చేస్తుంది!’
ప్రస్థుతం ఈ వ్యాసంలో నేను చేసింది మాత్రం- ‘శస్త్ర చికిత్స’. కనుక ఓర్చుకోండి. అంటే నా వాదన సరైనదా కాదా గమనించండి. లేదంటే నా వాదన ఎలా తప్పో ఖురాన్-హదీస్ వెలుగులో వ్రాయండి. నీలాపనిందలు మాత్రం వేయకండి.
అధిక శాతం
‘ముస్లిం పండితులు’, ‘ముస్లిం నాయకుల’
ఇస్లాం పట్ల
‘సరైన అవగాహన’, ‘దూరదృష్టి రాహిత్యం’
కారణంగా
ఒకవైపు-
సామాన్య ముస్లింలు ‘ఘోరమైన సమస్యలకు గురవుతున్నారు’.
మరొకవైపు-
ముస్లిమేతరుల దృష్టిలో ‘ఇస్లాం అప్రతిష్ట’పాలవుతోంది.
ముస్లిమేతరులు తమ సమస్యలకి గల ‘కారణాలు’ ఏమిటి? వాటి
‘పరిష్కారాలు’ ఏమిటి?
అన్న ప్రశ్నలకి
‘సమాధానం’ కేవలం ‘భౌతిక కోణం’లోనే వెతుకుతారు.
అయితే
ముస్లిములు ఆ ప్రశ్నలకి
సమాధానాలను ‘భౌతిక కోణం’తో పాటు, ‘ఖురాన్- సున్నత్ వెలుగు’లోనూ వెతకాలి.
ఖురాన్ అనగా- సర్వేశ్వరుడైన అల్లాహ్ ప్రబోధనలు. సున్నత్ అనగా- రుషీశ్వరుడైన ముహమ్మద్(s) ఆదర్శాలు.
రాజ్యాంగ బద్ధంగానూ పోరాడాలి, ‘ఖురాన్-సున్నత్’లనూ అనుసరించాలి!
నేటి భారతీయ ముస్లిముల ప్రధాన సమస్య- వారి ‘జాతీయత ప్రశ్నార్థకం కావటం’. ముస్లింల ఈ 'సమస్య'కి రాజకీయ కారణాలు ఏమిటో పరిశీలిద్దాం. ఉదాహరణకి: జాతి జనుల ‘స్థాయి’ (Status), వారి ‘హక్కులు’ (Rights) నిర్ణయించేది రాజ్యాంగం. మన రాజ్యాంగ ప్రవేశిక ప్రత్యేకతను గమనిస్తే...
“భారత ప్రజలమైన మేము” అనే ప్రకటనతో ప్రారంభమై... “మాకు మేము ఇచ్చుకుంటున్నాం” అనే ప్రకటనతో అది ముగుస్తుంది. దానర్థం- రాజ్యాంగం దృష్టిలో అధిక సంఖ్యాకులైనా, అల్ప సంఖ్యాకులైనా, ఆదివాసీలైనా, దళితులైనా లేక మరెవరైనా సరే భారతీయులందరు ‘సమాన స్థాయి’, ‘సమాన అవకాశాలు’ పొందడానికి అర్హులు.
దీనిని రాజ్యాంగ నిపుణులు ‘రాజ్యాంగ ఆత్మ’గా అభివర్ణించారు. ఒకవేళ ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే (violate) అలాంటి వారితో రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామిక పంథాలో పోరాడాలి. అయితే ముస్లిములు అంతటితో సరిపెట్టుకుంటే చాలదు.
ఒకవైపు- రాజ్యాంగ బద్ధమైన పోరాటం సాగిస్తూనే, మరొకవైపు- తమ'సమస్యల'కి ఖురాన్ చూపే 'కారణాలు' ఏమిటో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే, తమకు కలిగే 'ప్రతి మేలు'కి, 'కీడు'కీ ఖురాన్- హదీసులు చూపే కారణాలేమిటో, వాటి 'పరిష్కారాలేమిటో పరిశీలించాలి. ఆ తరువాత అవిచూపే పద్ధతిలో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఇది ముస్లిముల ధార్మిక విధి (వాజిబ్). ముస్లిముల 'జాతీయత ప్రశ్నార్థకం కావటం' అనే 'అత్యంత శాపగ్రస్థ సమస్య'కి 'ఖురాన్- హదీస్'లు చూపే 'కారణాలు', 'పరిష్కారాలు' ఏమిటో తెలపటమే నా ఈ వ్యాసం లక్ష్యం!
ఒక కుటుంబానికి చెందిన పిల్లల ‘ఉత్థాన పతనాలు’ వారి తలిదండ్రుల ‘ధర్మావగాహన-దూరదృష్టి’పై ఆధారపడి ఉంటాయి. అలాగే ఒక మత వర్గం ‘ఉత్థాన పతనాలు’ వారి మత పెద్దల ‘ధర్మావగాహన-దూరదృష్టి’పైనే ఆధారపడి ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల నుండి ముస్లిం సమాజం పతనపు అగాధాల్లో కూరుకుపోతూ ఉంది. నేటికీ ప్రపంచవ్యాప్త ముస్లిముల పరిస్థితి కుక్కలుచించిన విస్తరిలానే ఉంది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను గమనించండి.
- ప్రపంచ వ్యాప్తంగ బలవంతంగా గెంటివేయబడిన ముస్లిముల సంఖ్య: 7 కోట్ల 80 లక్షలు.
- సొంత దేశాల్లో స్థాన భ్రంశానికి గురైన ముస్లిముల సంఖ్య: 4 కోట్ల 10 లక్షల 30 వేలు.
- శరణార్థుల సంఖ్య: 2 కోట్ల 50 లక్షల 90 వేలు.
- ఆశ్రయం కోసం వెతుకులాడుతున్న శరణార్థుల సంఖ్య: 35 లక్షలు.
- వారిలో కొత్తగా చేరిన వారి సంఖ్య: 341,800.
ప్రస్తుతం భారత దేశంలో ముస్లిముల తలపై NRC ఖడ్గం వ్రేలాడుతుంది. దీనికి సంబంధించి ఎవరెవరో ఎన్నెన్నో ‘భౌతిక కారణాలు’ చేప్పారు. అయితే అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ చెబుతున్న ‘ఇస్లామీయ కారణాలు’ ఏమిటో అధ్యయనం చేద్దాం.
అల్లాహ్, ముస్లిములను ఎందుకు యాతనలకి గురి చేస్తాడు?
అల్లాహ్ సర్వ మానవాళి పట్ల అత్యంత దయ కలిగిన వాడు. పైగా తన పట్ల విశ్వాసం కలిగిన వారి విషయలో మరింత దయ కలిగి ఉంటాడన్నది నిస్సందేహం. అయితే నేటి అధిక శాతం ముస్లిములు ఘోరాతి ఘోరమైన సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏమిటో అల్లాహ్ స్వయంగా తెలుపుతున్న వైనాన్ని గమనించండి.
کَذٰلِکَ ۚۛ نَبۡلُوۡہُمۡ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ Thus did We try them because they were rebellious. వారి ‘అవిధేయత’ల కారణంగా మేము వారిని ఇలా ‘సమస్యల’కి గురి చేస్తాము. -7:163
పై వాక్యంలో ‘అవిధేయత’లకి పాల్పడినందుకే సమస్యలకి గురిచేస్తానని అల్లాహ్ స్వయంగా ప్రకటించటం గమనార్హం. అయితే, NRC అనే ‘అత్యంత దౌర్భాగ్యపు సమస్య’కి భారతీయ ముస్లిములు గురి కావటానికి వారి పెద్దలు పాల్పడిన ‘ఘోరాతి ఘోరమైన అవిధేయత’ ఏదో ఉండి ఉంటుందన్న మాట! అదేమిటో ఈ సందర్భంగా గమనించవలసి ఉంది.
భారతీయ ముస్లిం పెద్దలు ముగ్గురు తండ్రులను మార్చారు!?
అల్లాహ్ దృష్టిలో ఒక తండ్రిని మార్చటమే అత్యంత ఘోరమైన నేరం. అలాంటిది భారతీయ ముస్లిములు ఏకంగా ముగ్గురు తండ్రులను మార్చివేశారు! ఇలా అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాల పట్ల ‘అత్యంత ఘోరమైన అవిధేయత’కి పాల్పడ్డారు. ముస్లిముల జాతీయత ప్రశ్నార్థకం, వారి ఉనికి అనుమానాస్పదం కావటమనే 'అత్యంత శాపగ్రస్థ సమస్య'కి కారణం ఇదే!
అల్లాహ్ దృష్టిలో తండ్రిని మార్చటం అంటే ఏమిటి?
‘తండ్రి సంబంధం’ మౌలికంగా నాలుగు విధాలుగా ఉంటుంది. వాటిలో... 1. మానవ జాతిపరమైన తండ్రి ఆదాము లేక శంకరుడు (4:1) 2. మౌలిక వంశావళుల పరమైన తండ్రులు- మహారుషి మనువు (ప్రవక్త నూహ్), ప్రవక్త అబ్రాహాం (57:26) 3. సాధారణ వంశాల కారణమైన తండ్రులు (106:1) 4. జన్మనిచ్చిన తండ్రులు (33:5)
ఇస్లాం ధర్మ పరిజ్ఞానం లేని కొందరు ఇస్లాం పండితులు, నాయకులు- పైన పేర్కొన్న వాటిలో మొదటి సంబంధాన్ని తప్ప, తరువాతి మూడు విధాలైన తండ్రుల సంబంధాన్ని మార్చివేశారు! అంటే, ముస్లిములుగా మారిన భారతీయ హిందువులకి చెందిన ‘స్వదేశీ తండ్రుల’తో ఉన్న సంబంధాన్ని తెంచి, ‘విదేశీ తండ్రుల’తో కలిపివేశారు!
అదెలాగంటే...
1. వాస్తవానికి భారతీయులు మహారుషి మనువు (ప్రవక్త నూహ్) సంతానం. కనుక భారతీయ ముస్లిములు కూడా మహారుషి మనువు సంతానమే అవుతారు. కానీ వారిని అబ్రాహాం సంతానం అంటున్నారు. ఈ ప్రకారంగా ఒక తండ్రిని మార్చినట్టయ్యింది.
2. స్థానిక ‘కులం’ను లేక ‘వంశాన్ని సూచించే రావు, రెడ్డి, రాజు తదితర స్వదేశీ వంశాల పేర్లను (నసబ్) మార్చివేసి, ఖురైషీ, అన్సారి లాంటి విదేశీ వంశాలకి చెందిన పేర్లను పెట్టేసారు. ఇలా రెండవ తండ్రిని మార్చినట్టయ్యింది.
3. కన్న తండ్రితో ఉన్న సంబంధాన్ని కలిపి ఉంచే పసుపులేటి, రావిపాటి వంటి ‘స్వదేశీ ఇంటి పేర్ల’ను (నసబ్) మార్చివేసి, సయ్యద్, షేక్ వంటి ‘విదేశీ ఇంటి పేర్లు’ పెట్టేసారు. దీనిని బట్టి మూడవ తండ్రిని మార్చినట్టయ్యింది.
గమనిక: వంశాలను, కుటుంబాలను తెలిపే పేర్లను మార్చటం అల్లాహ్ దృష్టిలో తండ్రిని మార్చటమే!
భారతీయ ముస్లిములు మహారుషి మనువు వంశస్థులు!
భారతీయ ముస్లిములు మహారుషి మనువు సంతానం ఎలా అయ్యారు? అన్న సందేహానికి సమాధానంగా ఈ వాక్యాన్ని గమనించగలరు.
-57:26وَلَقَدْ أَرْسَلْنَا نُوحاً وَ إِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَ الْكِتَابَ فَمِنْهُمْ مُهْتَدٍ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ
And undoubtedly, We sent Nuh and Ibrahim and We placed Prophet hood and the Book in their offspring. some of them were guided but most of them are disobedient.
ఒకటి- “ప్రవక్త ఇబ్రాహీం వంశంలో ప్రవక్త పదవినీ, గ్రంథాలను ఉంచాను” అన్న అల్లాహ్ ప్రకటనకి ఆధారంగా వేలాది ప్రవక్తలను, వందలాది గ్రంథాలను ‘అరేబియా ద్వీపకల్పం’లో చూడగలుగుతున్నాం.
రెండు- “ప్రవక్త నూహ్ వంశంలో ప్రవక్త పదవినీ, గ్రంథాలను ఉంచాను” అన్న అల్లాహ్ ప్రకటనకి ఆధారంగా వేలాది ప్రవక్తలను, వందలాది గ్రంథాలను కలిగిన మరొక దేశం ఈ పుడమిపై ఉండాలి కదా! అది మన ‘భారత ఉపఖండం’ కాక, మరొకటి కాగలదా!? లేదు!
ఎందుకంటే, ‘అరేబియా ద్వీపకల్పం’ తోపాటు యావత్ లోకంలో అత్యంత ఆథ్యాత్మిక సంపద కలిగిన దేశం ఒక్క మన భారత దేశమే కనుక! ఇంకా, యావత్ లోకంలో- "మేము మహా రుషి మనువు సంతానం" అని ప్రకటించుకునేది ఒక్క భారత జాతీయులే! దీని ప్రకారం 'మనువు సంతానం' అని ఖురాన్ ప్రకటిస్తుంది- 'భారతీయుల గురించే' అన్నది నిర్వివాదాంశం.
ఈ విధంగా- భారతీయ ముస్లిములకి ‘ప్రవక్త ఇబ్రాహీం’తో ఒక్క ‘విశ్వాసపరమైన సంబంధం’ తప్ప, ‘వంశ పరమైన సంబంధం’ లేదు. కానీ ‘మహారుషి మనువు’తో అయితే ‘విశ్వాసపరమైన సంబంధం’తో పాటు, ‘వంశపరమైన సంబంధం’ కూడా ఉంది! కనుక అరేబియా ముస్లిములు ‘అబ్రాహాము సంతతి’ అయినందుకు గర్విస్తున్నట్లే, భారతీయ ముస్లిములు ‘మహారుషి మనువు సంతానం’ అయినందుకు గర్వించాలి.
ఈ విషయాన్ని గుర్తించి మసలుకొనకపోవటం అల్లాహ్ దృష్టిలో ఒక నేరమైతే, తాము అబ్రాహాము సంతానం అయినందుకు గర్వించటం మరొక నేరం! ముస్లిం పెద్దల ఈ పోకడల వలన భారతీయ ముస్లిములు స్వదేశీ మూలాలతో సంబంధాన్ని తెంచుకొని, విదేశీ మూలాలతో సంబంధాన్ని కలుపుకున్నట్టయ్యింది.
ఒకవేళ ఆ సంబంధాన్ని కనుక కలిగి ఉంటే- తోటి హిందూ వర్గాలతో ముస్లింలకి కేవలం పౌర సంబంధమే కాక, వంశ పరమైన భావోద్వేగపూరిత అనుబంద్ధం కూడా ఉండేది. దానికి ప్రతిస్పందనగా వీరు ముస్లిములు అయినప్పటికీ మన వంశస్థులే అన్న ‘వంశ పరమైన భావోద్వేగపూరిత ప్రేమ ముస్లిముల పట్ల హిందూ వర్గాల్లో ఉండేవి. అలాగే 57:26 లో అల్లాహ్ ఇస్తున్న సమాచారాన్ని నిర్లక్ష్యం చేసి, తమ మొదటి తండ్రిని (మనువును) మార్చి ఉండకపోతే, అది హిందూదేశ మూలాలతో ముస్లిముల సంబంధానికి ఒక సాక్ష్యంగా ఉండేది. తద్వారా ముస్లిముల జాతీయత గురించి మాట్లాడే అవకాశం ఎవరికీ ఉండేదే కాదు.
Surah al-haj: 22:78
یہی تمہارے) یعنی عربوں کے( باپ ابراہیم کا مذہب تھا
مِلَّۃَ اَبِیۡکُمۡ اِبۡرٰہِیۡمَ …
so follow the faith of your father Abraham.
ఈ వాక్యంలో ‘అరబ్బు జాతీయుల’ను ఉద్దేశించి- "మీరు అబ్రాహాము సంతానం" అని అల్లాహ్ స్వయంగా ప్రకటిస్తున్నాడు. అటువంటప్పుడు ‘భారత జాతీయుల’ను ఉద్దేశించి- "మీరు మనువు సంతానం" అని ప్రకటించవలసిన అవసరం లేదా? తప్పకుండా ప్రకటించాలి. ఎందుకంటే, భారతీయులు మహారుషి మనువు (హజ్రత్ నూహ్) సంతానం కనుక!
ఈ విషయాన్ని గుర్తించకుండా అధిక శాతం ముస్లిం మత పండితులు, నాయకులు భారతీయ ముస్లిముల వంశానికి చెందిన తండ్రిని మార్చివేశారు. ఇది అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన నేరం!
తండ్రిని మార్చటం అల్లాహ్ దృష్టిలో ఘోరాతిఘోరమైన అపరాధం!
ఇస్లాం అత్యంత సహజ ధర్మం. కనుక దాని తీర్మానాలూ, నిర్ణయాలూ అత్యంత సహజంగా ఉంటాయి. తండ్రీ-తనయుల సంబంధం అద్వితీయమైనది. దానికి ఏ సంబంధమూ ఎన్నటికీ సాటిరాదు. కాబట్టి దానిని తెంచటం లేక మరొకరితో కలపటం అల్లాహ్ మరియు ప్రవక్త దృష్టిలో అత్యంత ఘోరమైన నేరం. దానికి సంబంధించిన ఆధారాలను ఓసారి చూడండి.
1) వారిని (అనగా మీరు దత్తత తీసుకున్న పిల్లలను) వారి (కన్న) తండ్రుల పేర్లతోనే పిలవండి!
Call them after their fathers,
2) అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. this is more justified in the sight of Allah, هُوَ أَقْسَطُ عِنْدَ اللَّهِ
3) ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియకపోతే, అప్పుడు వారు మీకు ధార్మిక సోదరులు లేక స్నేహితులు.
but if you do not know their fathers, then they are your brothers in faith and as human being your cousin.
4) ఈ విషయంలో మీరు (ఇస్లాంలో లేనప్పుడు) చేసిన పొరపాటుకు ఎలాంటి దోషమూ లేదు.
And there is no blame on you regarding what has been committed by you unintentionally
5) కానీ ఇక మీదట అలా చేస్తే అది (పాపం) అవుతుంది.
yes that is a sin, which you may commit with the intention of your heart.
(ఇస్లాంలో లేనప్పుడు చేసిన పాపాల విషయంలో) అల్లాహ్ అత్యంత క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
And Allah is Forgiving, Merciful.
పై వాక్యంలో గమనార్హ విషయాల్లో మొదటిది- "సంతానాన్ని వారి కన్న తండ్రుల పేర్లతోనే పిలవండి!" అనే ఒక్క ఆజ్ఞ సరిపోతుంది. అయినప్పటికీ;
"అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది" అని ప్రకటించటం.
వారి తండ్రులు ఎవరో తెలియకపోతే సోదరులు లేక స్నేహితులు అవుతారు తప్ప కుమారులు మాత్రం కారు అని తేల్చి చెప్పటం.
ఇంకా అజ్ఞానం వలన అలా చేస్తే అది వేరే విషయం. కానీ బుద్ధిపూర్వకంగా చేస్తే మటుకు పాపం అని హెచ్చరించటం.
"నేను అత్యంత క్షమాశీలుడను, అపార కరుణాప్రదాతనై ఉంటాను" అన్న ప్రకటన నెరవేరాలంటే, చేసిన ‘నేరాన్ని అంగీకరించాలి’. ఎవరి పట్ల నేరానికి ఒడిగట్టారో వారితో ‘క్షమాపణ’ వేడుకోవాలి. ఈ ‘షరతుల’ను పూర్తి చేసిన వారికే అల్లాహ్ చేస్తున్న పై ప్రకటన వర్తిస్తుందన్నది గమనార్హం.
ఇంకా, ఎవరు ఆ రెండు పనులు చేయరో వారితో నేను అత్యంత కఠినంగా, అతి కర్కశంగా వ్యవహరిస్తాను జాగ్రత్తా! అన్న హెచ్చరిక కూడా అందులో ‘పరోక్షం’గా ఉందన్నది ఇక్కడ మరో గమనార్హమైన విషయం ఉంది.
గమనిక: చేసిన నేరాలను ఒప్పుకోకుండా లేక వాటిని విడవకుండా సమస్యల నుండి గట్టెక్కించమని అల్లాహ్’ను వేడుకోవటం కేవలం మూర్ఖత్వం. కొన్ని వందల ఏళ్ల నుండి మన ముస్లిం పెద్దలు చేస్తున్న పని ఇదే!