Posted by Sakshyam Magazine on Thursday, December 31, 2015
గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
‘ఆజ్ఞాతిక్రమమే పాపము (-1 వ యోహాను 3:4) పాపము వలన వచ్చు జీతము మరణము’… (రోమీయులకు 6:23) అని మరియు అలాగే ‘గొప్ప పాపము!’ (Great Sin!), (నిర్గమకాండము 32:30) ‘క్షమాపణ ఉన్న పాపము!’, ‘క్షమాపణ లేని పాపము!!’, (మత్తయి 12:32), ‘బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు!’ (సంఖ్యాకాండము 15:30, 31), ‘పొరపాటుగా జరిగే పాపాలు!’ (సంఖ్యాకాండము 15:29)… ఉన్నాయని గత అంశ్యములో తెలుసుకున్నాము. పాపపరిహారానికి ‘తర్కం’ చూపించే పత్యామ్నాయాన్నే పరిశుద్ధ బైబిలు గ్రంధమూ చూపిస్తుందా? లేక వేరే పత్యామ్నాయాన్ని చూపిస్తుందా? అన్న ప్రశ్నలకు సుస్పష్టమైన సమాధానమే ఈ వ్యాసం.
‘తర్కం’ ప్రకారం పాపపరిహారం!
పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రతిపాదించే ధర్మం ‘అత్యంత హేతుబద్ధమైనది’ మరియు ‘అత్యంత తార్కికమైనది’. అయితే ఆ గ్రంధాన్ని ప్రబోధించే అర్హులుగా చెప్పుకునే అధిక శాతం క్రైస్తవ బోధకులు ప్రతిపాదించే ధర్మం మటుకు- ‘అత్యంత హేతువిరుద్ధమైనది’ మరియు ‘అత్యంత తర్కరహితమైనది’. ఈ విషయం ఇప్పుడు మీకు చాలా విడ్డూరంగానూ, విచిత్రంగానూ అనిపించవచ్చు. అయితే బైబిలు గ్రంధ సమాచారంతో కూడిన మా వ్యాసాలను చదివిన తరవాత, అది నిజమేనని మీరే అంగీకరిస్తారు!
ఏది చేయటం వలన ఒక సమస్య తలెత్తిందో ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి? అని ప్రశ్నిస్తే, ‘తర్కం’ ఇచ్చే సమాధానం ఏమిటి?- ఏది చేయటం వలన సమస్య తలెత్తిందో దానిని చేయటం మానివేయటమే! ఇదే ‘తర్కం’ చేసే పాపపరిహారం! ఇంతకు మించి, దీని కొరకు పెద్దగా మల్లగుల్లాలు పడిపోవలసిన అవసరం ఏమీ లేదు!
పాతనిబంధన ప్రకారం పాపపరిహారం!
ఒక వ్యక్తి వివిధ ఆజ్ఞలను అతిక్రమిస్తే అనగా తప్పులు చేస్తే- దాని ప్రతికూల పరిణామాలకు ఎవరెవరు గురి కావచ్చు? అని ప్రశ్నిస్తే, 1. అతను వ్యక్తిగతంగా తన మానసిక లేక శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసుకోవచ్చు, 2. లేదంటే- ఎదుటివారిని మానసికంగా లేక శారీరంగా లేక అతనికి సంబంధించిన వస్తువులకు నష్టం కలగజేయవచ్చు, ఇంకా, 3. పర్యావర్ణానికి ప్రమాదం కలగవచ్చు, 4. తన సృష్టికర్తకు నొప్పిచినవాడు కావచ్చు. బైబిలు గ్రంధంలో దేవ దేవుడు ఇచ్చి ఉన్న ఏ ఆజ్ఞను అతిక్రమించినా కాస్త ఇంచుంచు ఆ విధమైన నష్టాలే సంభవిస్తాయి. దీనిని బట్టి ‘పాపము’ అనగా ‘నష్టము’ అని అర్థం అవుతుంది. అటువంటప్పుడు, కలిగిన ఆ ‘నష్టము’ను భర్తీ చేయటమే ‘పాపము’నకు పరిహారం అవుతుంది కదా!
ఇంతకూ పాపపరిహారానికి ‘తర్కం’ చెప్పిన పరిష్కారాన్నే పరిశుద్ధ ‘బైబిలు గ్రంధం’ చెబుతుందా? లేక వేరే పరిష్కారాన్ని చెబుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని
అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము
నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. 22. అతడు చేసిన అపరాధములలో
ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రదుకును.
23. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు
యెహోవా వాక్కు. -యెహేజ్కేలు 18:21-23
పాపపరిహారానికి ‘తర్కం’ ఏది చెప్పిందో పరిశుద్ధ బైబిలు గ్రంధం కూడా అచ్చం అదే చెప్పింది. ఇప్పుడు బైబిలు ప్రతిపాదిత పాప పరిహార విధానం ‘అత్యంత హేతుబద్ధమైనది’ మరియు ‘అత్యంత తార్కికమైనది’ అని మేము ప్రారంభంలో చెప్పింది పై వాక్యాల ద్వారా నిజమయ్యింది కదా!
దీని ప్రకారం- 1. తనకు నష్టదాయకమైన పాపాలను విడనాడితే తన వరకు ప్రాయశ్చిత్తం అయిపోతుంది. 2. ఇతరులకు తలపెట్టిన నష్టాన్ని భర్తీ చేసేస్తే అక్కడికది ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అలాగే 3. పర్యావర్ణానికి చేటూ చేసే పనులు మానుకుంటే అదే దానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఇక మిగిలింది దేవుడు. 4. తన పట్ల పాల్పడిన పాపాలకు ఆయన ఏవిధంగా ప్రాయశ్చిత్తం చేస్తాడో ఈ క్రింది గమనించగలరు.
ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను
దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక
మానెను. -యోనా 3:10
నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చెబున్నదే నిజమైతే- “వారు చేయుచున్న క్రియలను చూచి’ అని కాక, ‘వారు ఇస్తున్న బలులను చూచి దేవుడు వారిని రక్షించెను” అని పైన పేర్కొన్న పరిశుద్ధ బైబిలు వాక్యంలో ఉండాలి. అలాంటి ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో పూర్తి బైబిలు గ్రంధంలో కించిత్తు కూడా లేదు! దీనిని బట్టి- పాపపరిహారానికి రక్తప్రోక్షణం ఒక్కటే మార్గమంగా పాతనిబంధన కాలంలో ఉండేదనే అధికశాతం క్రైస్తవ బోధకుల ప్రచారం అసత్యమని పై వాక్యాల ద్వారా నిరూపితమయ్యింది.
నిజమే ‘ఆజ్ఞ అతిక్రమము’ వలన ‘పాపము’ వచ్చినప్పుడు, దానిని పోగొట్టువాలంటే చేయవలసింది ఏమిటి? అని ప్రశ్నిస్తే, కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాడెవడైనా ఇచ్చే సమాధానం- అతిక్రమించిన 'ఆజ్ఞల’ను తిరిగి పాటించటం అన్నదే కదా! ఈ మాత్రం దానికి అటు- బలవంతుడైన దేవ దేవుడే వచ్చి, బలహీనులైన ఈ మానవుల చేతిలో పడి చావవలసిన అవసరమూ లేదు! ఇటు- తాము చేసిన పాపకార్యాలకు మానవులే దేవుడు మీద పడి దారుణగా, కిరాతకంగా, హృదయ విదారకంగా హత్య చేయవలసిన అగత్యం అంతకంటే లేదు!!
అధికశాతం క్రైస్తవ బోధకులు చెప్పే కట్టు కథల్లో ఒకటి- “దేవ దేవుడు, క్రీస్తుకు పూర్వం పాత నిబంధన కాలంలో మానవుల పాపాలకు జంతువుల రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం గావించే ప్రోజెక్ట్ సఫలం చేయటానికి చాలా ప్రయత్నం చేసి చేసి విఫలమయ్యాడు!! ఇక ఇలాగైతే లాభం లేదని, ఈ దుష్ట మానవుల మొండి పాపాలు సమసి పోవాలంటే వాళ్ళచేతిలో పాడి ఇక తానే బలవ్వాలనే ఒక సరికొత్త ప్రోజెక్ట్ చేపట్టి, యేసు అవతారంలో ఈ లోకానికి వచ్చాడు" అన్నది. పుక్కిటి పురాణాలు వినే తెలివిలేని దద్దమ్మలకు ఈ కథ ఎంతో వినసొంపుగా ఉండవచ్చు! అర్థంపర్థం లేని ఇలాంటి కథలను నమ్మేవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. ఎవరి విశ్వాసం వారిది కనుక మనం ఎవ్వరినీ తప్పు పట్ట కూడదు.
అయితే ఇక్కడ మా అభ్యంతరం ఏమిటంటే- ‘అత్యంత హేతుబద్ధమైన’ మరియు ‘అత్యంత తార్కికమైన’ సిద్ధాంతాలను ప్రబోధించే పరిశుద్ధ బైబిలు గ్రంధమును చేత పట్టి ‘అత్యంత హేతువిరుద్ధమైన’ మరియు ‘అత్యంత తర్కరహితమైన’ విషయాలను బోధించటంపైనే! అలాంటి కాకమ్మ కథలతో ఏమాత్రం సంబంధం లేని పరిశుద్ధ బైబిలు గ్రంధమును వదిలేసి, అలాంటి పిట్ట కథలతో ఏదైనా ఒక గ్రంధాన్ని సొంతంగా రచిచుకొని దాని ద్వారా వాటిని బోధించుకుంటే మేము మీ జోలికి రాము, రావలసిన అవసరం మాకు లేదు! కాని పరిశుద్ధ బైబిలును చేత పట్టుకొని దానితో ఏమాత్రం సంబంధం లేని కథలను చెబుతూ మీరు ప్రజలను వంచితున్నంతకాలం వాటిని బైబిలు ద్వారా నిరూపించమని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము.
“పరిశుద్ధ బైబిలు బొధలను అనుసరిస్తున్నందుకు క్రైస్తవ సమాజం ఇతర మత వర్గాల కంటే అధికంగా నైతిక పతనానికి గురయ్యిందా? లేక అధిక శాతం క్రైస్తవ పండితుల పుక్కిటి పురాణాలను అనుసరిస్తున్నందుకా?”
09666488877
tmcnewstmc@gmail.comవీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.