Posted by Sakshyam Magazine on Thursday, February 11, 2016
భగవద్గీతలోని 7:23 వ శ్లోకానికి గీతామకరందం అనువాదకులు, వ్యాఖ్యాత అయినటువంటి శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు చాలా గొప్ప వివరణ ఇచ్చారు. ఒకసారి ఆ వ్యాఖ్యానాన్ని,భగవద్గీత శ్లోకాన్ని మనం స్మరించుకుందాం!
.
అంతవత్తు ఫలం తేషాం తద్భత్యల్పమేధసామ్
దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామాపి. గీత 7:23
తా:- అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలం నాశవంతమైయున్నది. (ఏలననగా) దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు. నాభక్తులు (నన్ను పూజించువారు) నన్నే పొందుచున్నారు.
వ్యాఖ్య : పరమాత్మను వదిలి ఇతర దేవతలను నారాధించువారెట్టివారో వారెత్తి ఫలితమును బొందగలరో, భగవద్భక్తులెట్టి ఫలితములను బొందగలరో ఈ శ్లోకమున వివరించబడినది. సాక్షాత్ దేవదేవుడగు పరమాత్మను వదిలి ఇతర దేవతలను నాశ్రయించువారు, భజించువారు అల్పఫలములనే పొందుదురు. కావున అట్టి నశ్వరఫలితములకై అఱ్ఱులు చాచువారు అల్పబుద్ధి (Small brain) కలవారని ఇట పేర్కొనబడినది. ఏలాయనిన పూర్ణబుద్ధి కలవారైనచో శాశ్వత ఫలమొసంగునట్టి , జన్మ రాహిత్యమును కలుగజేయునట్టి పరమాత్మనే ఆశ్రయించెడివారుగదా! " ఈ విధంగా ప్రకాశానందగిరి స్వాములవారు దేవతారాధన అల్పబుద్ధి కలిగిన వారు మాత్రమే చేస్తారంటూ ,పరిపూర్ణ బుద్ధి గలిగిన వారు దేవదేవుడగు ఆ అక్షరపరబ్రహ్మమునే వేడుకొందురనియు చాలా చక్కగా వివరించారు. నిజానికి గీతా శాస్త్రం ప్రకారము నిర్గునోపాసమే శ్రేయస్కరము. వేద శాస్త్ర ప్రకారము విగ్రహారాధన, దేవతా పూజలు మనిషిని అధో గతికి దిగజార్చేవే! శుభమ్.