Posted by Sakshyam Magazine on Tuesday, August 12, 2014
ప్రియ క్రైస్తవులారా!మీరు గొప్పదైవజనులే కావచ్చును లేక గొప్పప్రార్ధనాపరులే కావచ్చును.అయితే మీరు క్రీస్తు బోధకు లోబడిన బోధను చేసే బోధకులను అనుసరిస్తున్నారా? లేక కేవలం క్రీస్తు పేరు చెప్పి,సొంతబోధలు చేసుకునే బోధకులను అనుసరిస్తున్నారా? అన్నది క్రీస్తు విశ్వాసిగా మీకు మీరే పరిశీలించుకోవాల్సి ఉంటుంది.అలా కాకుండా ఏ విశ్వాసమైతే ఏమైందిలే!ఏ పాష్టర్ అయితే ఏమయ్యిందిలే!! అని నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..."
అప్పుడాయన (యేసు) ఎడమ వైపున ఉండు వారిని చూచి- శపించబడినవారలారా!నన్ను విడిచి అపవాదికిని (సాతానుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.-మత్తయి 25:41" అన్న పరిశుద్ధ వాక్యం ప్రకారం స్వయంగా యేసుచే మీరు తృణీకరించబడే ప్రమాదం ఉంది.ఆనాడు "
వాక్య విరుద్ధమైన విశ్వాసం"కలవారు ఎడమవైపున మరియు "
వాక్యానుసారమైన విశ్వాసం" కలవారు కుడివైపున ఉంటారు.ఆనాటి ఘోరాతిఘోరమైన ఆ విపత్కర పరిస్థితిలో ఈనాటి అయ్యగార్లు వచ్చి మిమ్మల్ని ఏమాత్రం కాపాడలేరు.ఈ పరిస్థితే కనుక మీకు దాపురిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది!?
ఈనాడు ఒక సంఘపువారు ప్రకటించే విశ్వాసానికి మరొక సంఘపువారు ప్రకటించే విశ్వాసానికి మధ్య అసలు ఏమాత్రం పొతనే ఉండటం లేదు.అందుకే ఒక పాష్టరుకు మరొక పాష్టరుకు పడటం లేదు.ఆయా బోధకులు ప్రజలను సంఘ,సంఘలుగా విడగొట్టి, అసలు క్రీస్తును ప్రక్కకు నెట్టి,తామే ప్రజలకు అపరక్రీస్తులై పాలిస్తూ,సువార్తను సొమ్ముచేసుకుంటున్నారు.అందుకే -
వారు(అబద్ధబోధకులు)అధికలోభులై,కల్పనా వాక్యములు చెప్పుచు, మీ (సంఘస్తుల)వలన లాభం సంపాదించుకొందురు"-2పేతురు 2:2 అని పరిశుద్ధ లేఖనం ముందే తెలియజేసింది.దీనికారణంగా క్రీస్తుచే స్థాపించబడిన "
సార్వత్రిక పరిశుద్ధ క్రీస్తు సంఘం" (చర్చి)చీలికలు పేలికలుగా విడిపోయింది.విశ్వజనీన సిద్ధాంతం ప్రకారం- "
ఐక్యత"కు "
కేంద్రం"అన్నది ఒకటి తప్పనిసరి.క్రైస్తవులైన వ్యక్తుల,సంఘాల ఐక్యతకూ పరిశ్ద్ధ బైబిల్ గ్రంధం ద్వారా ఒక "కేంద్రకం"ప్రతిపాదించబడుతుంది.దానిని ఈ క్రింది గమనించగలరు.
ప్రభువు (యేసు)ఒక్కడే,విశ్వాసమొక్కటే,బాప్తిస్మమొక్కటే,
అందరికి తండ్రియైన దేవుడు (యెహోవా)ఒక్కడే. -ఎఫెసీ 4:5
పై వాక్యాన్ని సకల క్రైస్తవ సంఘాల వారు యధాతధంగా,ఏకగ్రీవంగా అంగీకరించిననాడు మనలో ఐక్యత ఏర్పడదంటారా? కచ్చితంగా ఏర్పడుతుంది.కాని నేటి మన దౌర్భాగ్యం -"
యేసు విషయంలో, "
విశ్వాసం"విషయంలో "
బాప్తిస్మం" విషయంలో చివరకు "
దేవుని" విషయంలో సైతం ఎంతోగలిబిలి!మరెంతో గందరగోళం!!ఇదే చర్చి వ్యవస్థ విచ్చిన్నానికి కారణభూతమయ్యింది.
M.D.N.ప్రకాష్
(యెహోవా,యేసు,పరిశుద్ధాత్మ ఒక్కటి కాదా!?"అనే పుస్తకం నుండి...)