Posted by Sakshyam Magazine on Thursday, August 14, 2014
"మూడు విషయాలు కావాలి.దైవంపై నమ్మకం,చిత్తశుద్ధి,దైవప్రవక్త(సల్లం)సూచించిన విధానం"
1.దైవంపై నమ్మకం
అల్లాహ్ మీద,ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం ఉండాలి.
- "దేవుని ఏకత్వాన్ని" విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని ఆతిధ్యంగా స్వర్గపు ఉద్యానవనాలు ఉంటాయి. ఖురాన్-18:107
దైవప్రవక్త(స)కూడా ఇలా ఉపదేశించి ఉన్నారు.
- "అల్లాహ్ ను విశ్వసించాను"అని చెప్పి దాని మీద నిలకడగా ఉండు. (ముస్లిం)
2.చిత్తశుద్ధి
ఏ మంచి పని చేసినా కేవలం అల్లాహ్ ప్రసన్నతకోసం,ఆయన సంతోషం కోసమే చేయాలి.పరుల మెప్పుకోసమో,పేరు ప్రఖ్యాతుల కోసమో చేయరాదు.
- (ప్రజలారా!)అల్లాహ్ ను మాత్రమే వేడుకొండి.మీ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించుకొని.ఖురాన్-40:14
దైవప్రవక్త(స)కూడా ఇలా ఉపదేశించి ఉన్నారు.
- "ఎవడైతే చిత్తశుద్ధితో "లా ఇలాహ్ ఇల్లల్లాహ్"(అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడు మరొకడు లేడు)"అని అంటాడో అతడు స్వర్గానికి వెళ్తాడు.(హదీస్)
3.దైవప్రవక్త(స) సూచించిన పద్ధతి
ఏ ఆరాధననైనా దైవప్రవక్త(స)ప్రబోధించిన పద్ధతి ప్రకారమే చేయాలి.అల్లాహ్ సన్నిధిలో ఆయన ప్రవక్త విధానం మాత్రమే అంగీకరించబడుతుంది.అందుకు విరుద్ధమైన ఏ పనీ అంగీకరింపబడజాలదు.
- "దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి,ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి" ఖురాన్59:7
అంతేకాదు,స్వయంగా దైవప్రవక్త(స)కూడా ఇలా హెచ్చరించారు.
- "మా ఆదేశాలకు అనుగుణంగా లేని పనులు త్రోసిపుచ్చబడతాయి"(ముస్లిం).