Posted by Sakshyam Magazine on Friday, August 8, 2014
ప్రతిరోజూ ఉదయాన్నే [తెల్లవారుజాము]ప్రార్ధన చేస్తే అద్భుతాలు జరుగుతాయి.చక్కటి ఆలోచనలు,భావాలు మనస్సులో ఏర్పడతాయి.సంఘర్షణాత్మక ఆలోచనలు అంతమై మనస్సు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది.తల్లి జోల పాడుతుంటే ఒడిలో పడుకున్న బిడ్డ ఆదమరచి నిద్రించినట్టుగా మనస్సు విశ్రాంతి పొందుతుంది.రోజూ క్రమం తప్పకుండా ప్రార్ధన చేస్తే మిగతా విషయాలు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి.మనిషి మానసిక ప్రశాంతతకు కారణం దైవప్రార్దనే.
ఈ విషయంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్(స)వారు ఓ గొప్ప మాట సెలవిచ్చారు.
అల్లాహ్ ను వేడుకునేవారికి...ప్రశాంతతకు కొదువలేదు.
ఎంత గొప్ప విషయం!
మనిషి ప్రశాంతతకు,సమస్యా నిర్మూలానికి కావల్సిన మనోధైర్యానికి దైవప్రార్ధన ఒక్కటే ఆధారం.