Posted by Sakshyam Magazine on Wednesday, December 17, 2014
దేవుడు మానవళి "ఇహ-పర" సాఫల్యానికి నిర్దేశించిన సమస్త ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? అన్న ప్రశ్నకు సర్వశక్తి గల దేవుడైన యెహోవా ఇస్తున్న సమాధానం ఏమిటో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.పైన ఆకాశమందేగాని,క్రిందనున్న భూమియందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని, యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరించకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానైన నేను రోషము గల దేవుడును. -ద్వితీ:కా:5:7-9
పై వాక్యాలద్వారా ధర్మశాస్త్రపు మొదటి ఆజ్ఞ ఏమిటో సుస్పష్టంగా అర్ధమవుతుంది. అయితే యెహోవా దేవుని ఆ సర్వోన్నత దైవత్వం "పరిమిత కాలం"(Limited Time) పాటు మాత్రమే ఉంటుందా? లేక "శాశ్వతకాలం" (Permanent Time) పాటు ఉంటుందా? అన్న ప్రశ్నకు యెహోవా దేవుడు స్వయంగా ఇస్తున్న సమాధానం ఏమిటో ఈ క్రింది గమనించగలరు.
...నాకు (యెహోవాకు) ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. -యెషయా 43:10
పై వాక్యం ప్రకారం -యెహోవా దేవుని ఆ సర్వోన్నత దైవత్వం "పరిమితకాలం" (Limited Time) పాటు కాదు."శాశ్వత కాలం" (Permanent Time) వరకూ ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటున్నాడు. అటువంటప్పుడు మరియమ్మకో, పరిశుద్ధాత్మకో లేక యేసుకో తరువాతకాలంలో యెహోవా దేవుని ఆ "సర్వోన్నత దైవత్వం" బదిలీ అయ్యిందనే వాదాలను పరిశుద్ధ గ్రంధం ఖండిస్తున్నట్లే కదా! ఇక, పరిశుద్ధ గ్రంధమైతే ఈ క్రింది రెండు పనులు మాత్రం చేస్తుంది.
- ఒక్క యెహోవా మాత్రమే సర్వోన్నత దేవుడవటాన్ని సమర్ధిస్తుంది.
- మరొకడు ఆయనవంటి దేవుడవటాన్ని బాహాటంగా ఖండిస్తుంది.
"
యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? లేదా?" అనే పుస్తకం సౌజన్యంతో...