Posted by Sakshyam Magazine on Thursday, December 18, 2014
తనను విసర్జించి, ప్రవక్తలను,పరిశుద్ధులను దైవాలుగా భ్రమించి, ఆరాధించేవారికి సర్వాధికారి అయిన యెహోవా దేవుడు చేసే "హెచ్చరిక!" ఏమిటో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు-నరులను ఆశ్రయించి
శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును
యెహోవా మీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. - యిర్మియా 17:5
పై వాక్యం ప్రకారం ఆరాధించబడవలసిన యెహోవా దేవుని మీదనుండి హృదయాన్ని తొలగించుకుని నరులైన ప్రవక్తలూ, పరిశుద్దులనూ దైవాలుగా భ్రమించి, ఆశ్రయించటం అవిశ్వాసం. అలాంటి అవిశ్వాసులు శాపగ్రస్తులు.వారి నివాసం "నిత్యనరకం" అన్నది నిస్సందేహం.
ఆ విధమైన అవిశ్వాసులుగానే యెహోవా మీదనుండి తమ హృదయాన్ని తొలగించుకుని
1వ తిమోతి 2:5వ పరిశుద్ధవాక్యం ప్రకారం నరుడు అయిన యేసును "క్రీస్తు"గా మాత్రమే నమ్మవలసింది పోయి, దేవునిగా భ్రమించి, ఆశ్రయించేవారూ శాపగ్రస్తులవ్వరా? వారి నివాసం కూడా నిత్య నరకమవ్వదా!? కాస్త ప్రశాంతంగా ఆలోచించగలరు.
యెహోవా(సర్వేశ్వరుడు)ను దేవునిగా చేసుకున్నవారు "ధన్యులు" - పరిశుద్ధ బైబిల్ గ్రంధ శుభవార్త!
సర్వశక్తిగల ఏకైక యెహోవాను మాత్రమే దేవునిగా అంగీకరించిన నిజమైన విశ్వాసులకు కీర్తనకారుడైన దావీదు, దేవుని తరపున ఇస్తున్న "శుభవార్త!" ఏమిటో ఈ క్రింది వాక్యాలలో చూడగలరు.
ఇట్టి స్థితిగలవారు ధన్యులు, యెహొవా తమకు దేవుడుగా గల
జనులు ధన్యులు -కీర్తనలు 144:15
పైవాక్యం ప్రకారం- యెహోవాను మాత్రమే తమ ఏకైక దైవంగా చేసుకున్న వారు "
ధన్యులు" అలాంటి ధన్యులకు ప్రాప్తించేది "
నిత్యజీవం" అన్నది నిస్సందేహం. కాబట్టి యెహోవాను "
అద్వితీయ దేవుని"గా మరియు యేసును "
క్రీస్తు"గా యోహాన్ 17:3వ వాక్యంలోని "
క్రీస్తు బోధ" ప్రకారం తమ విశ్వాసాన్ని స్థిరపరచుకున్న క్రైస్తవులు మాత్రమే "
ధన్యులు!" వారు నిత్యజీవానికి అర్హులై తీరుతారు.ఇదే దేవుడు చేసే "
హెచ్చరిక!" మరియు "
శుభవార్త!".
* "యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? లేదా?" అనే పుస్తకం సౌజన్యంతో...