Posted by Sakshyam Magazine on Friday, February 6, 2015
3.యేసు స్త్రోత్రార్హుడైన దేవుడా?
ఈయన (యేసు)వీరివారు; శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను.
ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్త్రోత్రార్హుడై
యున్నాడు- ఆమేన్ -రోమా 9:5
యేసు దైవత్వాన్ని నిరూపించడానికి ఉపయోగించే వాక్యాలలో పైన పేర్కొన్నదొకటి. ఈ వాక్యం ఎంతో స్పష్టంగా యేసును సర్వాధికారి అయిన దేవుడు అని ప్రకటిస్తుంది. ఇక యేసును దేవుడు అని నమ్మటానికి ఆలస్యం ఎందుకు? అన్నంత ఆత్రుతను మన క్రైస్తవ పండితులు ప్రదర్శిస్తుంటారు. ఇక్కడా వారి తొందరపాటుతనమే తప్ప వారు అనుకుంటున్నది పై వాక్యంలో ఏమీలేదు.
బైబిలు ఒక ప్రాచీన గ్రంధం. అది ఎన్నెన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పటికి మన వద్దకు చేరింది. ఒకప్పుడు అన్యుల ఘోరమైన దాడులలో తగలబడటం. తిరిగి ఎందరో ఎన్నెన్నో కష్టాలకోర్చి శ్రమించి ఆయా వ్యక్తుల నుండి కొన్నికొన్ని ప్రతులను సేకరించి వాటన్నిటినీ గ్రంధరూపం ఇవ్వటం అనేకసార్లు తటస్థించింది. మరోవైపు అనువాదాలు, వ్యాఖ్యానాల పరంపర వీటన్నింటిని అధిగమించేటప్పుడు అనువాద పరమైన వ్యాఖ్యానపరమైన కొన్ని తప్పులు సహజంగా దొర్లాయి. అలాంటి తప్పులలోని ఒక తప్పిదం కారణమే పైవాక్యం యేసు దేవుడనే అర్ధాన్నిస్తుంది. ప్రస్తుతం మనం చదువుతున్నది ప్రొటెష్టంట్ బైబిల్. ఇది గత 17వ శతాబ్దం నుండి మనకు దొరికింది. దీనికంటే ముందు ఉన్న క్యాధలిక్కు బైబిల్ అసలైనది. ఆ బైబిల్ నుండి సేకరించేటప్పుడే ఈ రోమా 9:5ను తప్పుగా లిఖించుకోవటం జరిగింది. అదే వాక్యాన్ని క్యాథలిక్ బైబిలులో గమనించగలరు.
వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవ రీత్యా వారి జాతివాడే.
సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.
రోమా 9:5
పై వాక్యాన్ని గమనించండి యేసు దేవుడు లెక స్తోత్రార్హుడు అనే అర్ధం ఏ మాత్రమైనా వస్తుందా? లేదే! అందుకే దేవుడైన యెహోవా తన గ్రంధాన్ని పరిశీలించి చదవమని యెషయా 34:16లో ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక బైబిల్ పాఠకుడు యేసు ఎవరు? దేవుడెవరు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం కోరుకుంటే బైబిల్ లోని అక్కడక్కడ వాక్యాలను తీసుకుంటే సరిపోదు. బైబిల్ ఇచ్చే పూర్తి సారాంశాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడే సత్యం ఏమిటో బయటపడుతుంది. అంతేగాని ఏదో ఒక మూలలో ఏదో ఒక వాక్యంలోని ఒక ప్రత్యేక ముక్కను పట్టుకుని దీనిని బట్టి యేసు దేవుడు అని నమ్మటం అలా ప్రచారం చేయటం ఘోరమైన పాపం అవుతుంది.
రోమా 9:5 ప్రకారం యేసు నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అనే విశ్వాసమే కనుక పౌలు కలిగి ఉంటే తన పద్నాలుగు పత్రికలలోని ప్రారంభవాక్యాలలో యెహోవాను దేవునిగా మరియు యేసును క్రీస్తుగా, ప్రభువుగా ఎందుకు పేర్కొంటాడు? ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
...మన తండ్రియైన (యెహోవా) దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తు
నుండియు, కృపా సమాధానములు మీకు కలుగును గాక... -రోమా 1:2-7
పై వాక్యంలో పౌలు దైవాన్ని మరియు యేసును వేర్వేరుగా ఎంతో స్పష్టంగా పేర్కొంటున్నాడు. ఒకవేళ ఆ యెహోవాయే యేసుగా రూపాంతరం చెంది వచ్చేసి ఉంటే కేవలం దేవుడైన యేసు కృప మీకు కలుగునుగాక! అని మాత్రమే చెప్పేవారు. ఒకవేళ రోమా 9:5లో యేసు స్తోత్రార్హుడైన దేవుడు అనే సత్యం పౌలుకు బయల్పడిందనుకుందాం. మరి ఆ తరువాత తాను రాసిన పదమూడు పత్రికలలోనూ రోమా పత్రికలో 1:2-7లోని వాక్యాన్ని తిరిగి ఎందుకు రాస్తాడు. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను చదవండి.
మన తండ్రియైన (యెహోవా) దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు
నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. -1.కొరింథీ 1:3
ప్రతి పత్రిక ప్రారంభంలో పౌలు ఇదే విధంగా "తండ్రియైన దేవుని" మరియు "యేసు క్రీస్తు"ను పరస్పరం వేర్వేరుగా చూపి ఎంతో స్పష్టంగా రాసాడు. అంటే అతని దృష్టిలో యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు వేరు వేరు, అయి ఉన్నారన్నమాట. అనువాదంలోని పొరపాటు కారణంగా రోమా 9:5లో పూర్తి బైబిల్ ఇచ్చే సందేశానికి వ్యతిరేకమైన యేసుదేవుడనే భావన ప్రకారం మనం నడుచుకుంటే- అది పూర్తి బైబిల్ సువార్తకు, యేసుబోధకు, ఆదిమ అపోస్తలుల విశ్వాసానికి వ్యతిరేకం అయిపోతుంది.
సరే అయినప్పటికీ రోమా 9:5లో పౌలు చెప్పిందే నిజం అనుకుందాం. అటువంటప్పుడు పొలు, యేసును స్తుతించాలి కదా! అలా పౌలు యేసును స్తుతించినట్లు పౌలు వ్రాసిన 14 పత్రికలలో ఎక్కడైనా ఒక్కగాని ఒక్క వాక్యం కనిపిస్తుందా? లేదే! పైగా పౌలు ఎవనిని స్తుతిస్తున్నాడో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు,
మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక
-1.కొరింథీ 15:57
మా ద్వారా ప్రతి స్తలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను
కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో
ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. -2.కొరింథీ 2:14
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము
అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. -2.కొరిందీ 1:3
పై వాక్యాలను పరిశీలించకుండానే పౌలు దృష్టిలో స్తోత్రార్హుడెవరో తేటతెల్లం అవుతుంది.(రోమా9:5లో) పౌలు, యేసును స్తోత్రార్హుడైన దేవుడు అని చెప్పి , ఆ తరువాత యెహోవా స్తోత్రార్హుడైన దేవుడు అని ఎందుకు ప్రకటిస్తాడు? పౌలు ఆ ప్రకటన కూడా ఎంతో విపులంగా వివరంగా -"కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి" అని ప్రకటిస్తున్నాడు. అంటే పౌలు యేసును స్తుతిస్తున్న కనీస అపోహ కూడా కలుగకుండా ఎంతో జాగ్రత్తగా కేవలం ఒక్క యెహోవా తండ్రికే స్తోత్రము చెల్లిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి రోమాలోని 9:5 వాక్యం అనువాదలోపమా? లేక పౌలు విశ్వాసమా? ఆదిమ అపోస్తలుల విశ్వాసం ప్రకారం యెహోవా తనను మాత్రమే స్తోత్రం చేసే జ్ఞానాన్ని మరియు యేసును పోలి నడుచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక.ఆమీన్. (
Next Page)