Posted by Sakshyam Magazine on Thursday, February 12, 2015
5.యేసు నిజమైన దేవుడా!?
మనము సత్యవంతుడైన (యెహోవా) వానిని ఎరుగవలెనని దేవుని
కుమారుడు (యేసు) వచ్చి మనకు వివేకమనుగ్రహించి యున్నాడని
ఎరుగుదుము. మనము దేవుని (యెహోవా)కుమారుడైన యేసుక్రీస్తు
నందున్న వారమై సత్యవంతుని(యెహోవా)యందున్నాము. ఆయనే
(యెహోవాయే) నిజమైన దేవుడును, నిత్యజీవమునైయున్నాడు.
-1వ యోహాను 5:20
పై వాక్యం విషయంలోనూ అధికశాతం క్రైస్తవపండితులు గలిబిలికి లోనైయున్నారు. "నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు" అనగా యేసు అనుకుని పొరబడుతుంటారు. వాక్యాన్ని కాస్త పరిశీలనగా చూస్తే అసలు విషయం స్పష్టం అవుతుంది. ఆ విధమైన ఆలోచన కలగటానికి కారణం యేసు (
యోహాను 14:6లో) "నేనే సత్యమును" అని ప్రకటించి ఉన్నారు కనుక. కాని బైబిల్ ఒక విస్తారమైన గ్రంథం. ఒక లోతైన సందేశం కలిగి ఉన్న గ్రంథం. దాని పద ప్రయోగం విసృతమైనది. అంటే ఒకే పదం అనేకుల కొరకు ఉపయోగించబడి ఉంటుంది. దాని ఈ లక్షణాన్ని గుర్తించనివారు, దాని సరళ సందేశాన్ని వక్రంగా అర్థం చేసుకునే ప్రమాదం అధికంగా ఉండి. క్రైస్తవ సమాజం ఇప్పటికే అలాంటి గందరగోళానికి గురైపోయింది. కూడా! అందుకే క్రైస్తవ సమాజం విశ్వాసపరమైన వైరుధ్యాలకు గురైపోయి, మూడువేల సంఘాలుగా విడిపోయింది. నైతిక పతనానికి లోనైపోయింది. భావసారూప్యత లేని వర్గం అది ఎంత విస్తరించిపోయినా ఒకరోజు అంతర్గత కుమ్ములాటలతో రణరంగంగా మారిపోయింది. అందుకు క్రైస్తవ మేధావులు, పండితులు "వాసి"తో పాటు "రాశి"కి ప్రాధాన్యతనివ్వవలసి ఉన్నది. ఇతర వర్గాలలో ఉన్న విశ్వాసపరమైన అస్పష్టత,అనైక్యత, అనైతికత, అంతర్గత సంఘర్షణల వంటి చెడులన్నీ క్రైస్తవంలో కూడా ఉంటే ఇక, క్రైస్తవానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా బైబిలులాంటి ఒక గొప్ప గ్రంధాన్ని కలిగి ఉండి కూడా క్రైస్తవానికి ఇలాంటి దుస్థితి దాపురించటం కడు శోచనీయం.
సరే పై వాక్యాన్ని విశ్లేషించుకుందాము. పై వచనంలో సత్యం లేక సత్యవంతుడు లాంటి పదాలు కారణంగా ఆ వాక్యంలో దేవుడు అని చెప్పబడుతున్నది యేసును గురించి అని అపోహ పడుతున్నారు కొందరు పండితులు. ఈ క్రింది వాక్యాన్ని గమనించండి.
యేసు-నీవన్నట్టు నేను రాజునే; సత్యము (యెహోవా)ను గూర్చి సాక్ష్య
మిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని
-యోహాను 18:38
ఈ పై వచనానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఇందులో యేసు జన్మమునకు గల మూల కారణం ఏమిటో స్వయంగా యేసు నోటనే చెప్పబడి ఉన్నది. యేసు పుట్టుకకు గల మౌలిక కారణం ఏమిటి? "సత్యము"నకు సాక్ష్యమిచ్చుట. ఏమిటి సత్యము? సత్యము అనగా సర్వసృష్టికర్త అయిన యెహోవా. అంటే యెహోవాను గురించి సాక్ష్యమిచ్చుటకు యేసు పుట్టారన్నమాట. దీని వివరణనే యేసు ప్రత్యక్ష శిష్యుడైన యోహాన్ (1యోహాను 5:20లో) "మనము సత్యవంతుడైన వానిని అనగా దేవుని (యెహోవాను) ఎరుగవలెనని యేసు వచ్చి మనకు వివేకమను గ్రహించియున్నాడని యెరుగుదం" అని చెబుతున్నాడు. ఇంకా ఆ వాక్యంలోనే - ఆ సత్యవంతిడే నిజమైన దేవుడు అని చెప్పటానికి కారణం ఏమిటి? అంటే...
యెహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవముగల దేవుడు ఆయనే
సదాకాలమందు రాజు -యిర్మియా 10:10
పైవాక్యం ఆధారం చేసుకునే యేసు, యేసు అనంతరం యేసు శిష్యులు సువార్తను ప్రకటించారు. కాని నేడు ఈ పరంపరకు పూర్తి వ్యతిరేకంగా అసలుసిసలైన యెహోవా దేవుడిన్ని పూర్తిగా విస్మరించేసారు. యేసును అనుసరించవలసింది పోయి, ఆయనను దైవంగా ప్రతిష్ఠించుకున్నారు. ఇది నిజానికి యేసు బోధలకు పూర్తి విరుద్ధం. అయితే యేసుకు దైవత్వాన్ని ఆపాదించటానికి ఎన్నెన్నో ప్రయాసలు పడుతూ వారు, అందులో భాగంగానే
1వ యోహాను 5:20 వచనాన్ని తప్పుడు వ్యాఖ్యానం చేస్తుంటారు. దానికి కొందరు ప్రభావితులు కూడా అవుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని వాక్యాలు అటు దేవునికి మరియు ఇటు యేసుకు ఇంకా ఇతరులకు కూడా వర్తిస్తుంటాయి. అలాంటి కొన్ని వాక్యాలను తరువాతి పేజీలలో గమనించగలరు. (
Next Page)