Posted by Sakshyam Magazine on Wednesday, January 13, 2016
పరిశుద్ధ
బైబిలు ప్రబోధనల ప్రకారం:
యేసు సిలువపై మరణించ లేదు!-8
(పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా
కఠినాత్ముడా? లేక
కరుణామయుడా?)
గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
గత వ్యాసం ద్వారా పాత నిబంధన ప్రకారం- నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు ప్రకటిస్తున్నట్లు దేవ దేవుడు 'ప్రాణము' మరియు 'రక్తము' ఉన్నవాటిని
మాత్రమే కాక, ఆనాటి ఆర్ధిక మారకాలైన పశువులను, పిండి పదార్ధాలను, వెండి-బంగారాలను కూడా 'అర్పణ' మరియు 'బలి' అని పేర్కొనటమైనది.
దీనిని బట్టి- దేవ దేవుడు పాత నిబంధన కాలంలలో కేవలం ఒక్క 'రక్తము'ను మాత్రమే పాప
పరిహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకునే వాడని నేటి అధికశాతం బోధకులు చేసే ప్రచారం 'పరిశుద్ధ బైబిలు
గ్రంధ' ప్రబోధనలకు
పూర్తిగా వ్యతిరేకమైన అబద్ధ ప్రచారమని తెలుస్తుంది.
అలాగే పాప పరిహారానికి దేవుడు చెల్లించమన్న 'అపరాధ రుసుము' (పెనాల్టి) తన కోసం కాదు, ప్రజల కోసమే అని 'పరిశుద్ధ బైబిలు
గ్రంధం' తేలియజేసిన
వైనాన్నీ తెలుసుకున్నారు. దీనిని బట్టి- సర్వ మానవుల పాప పరిహారానికి యేసు 'రక్తము'ను దేవ దేవుడు 'అపరాధ రుసుము' (పెనాల్టి) తన కొరకు తీసుకున్నాడని చేసే
ప్రచారమూ అబద్ధమని 'పరిశుద్ధ బైబిలు
గ్రంధ' ప్రబోధన ద్వారా తెలిసింది. ఎందుకంటే- దేవ దేవుడు నిరపేక్ష పరుడు. అయన మానవులకు కావలసినవన్నీ ఇచ్చేవాడేగాని మానవుల
నుండి ఏ ఒక్కటీ పుచ్చుకునే వాడు
కాడు కనుక.
నేటి అధిక శాతం క్రైస్తవ బోధకుల ప్రచారాన్ని బట్టి- యెహోవా దేవుడు, పాత నిబంధన కాలంలో
మానవుల పాపాలను పరిహారం చేయటానికి పశువుల 'రక్తము'ను కోరుకున్న రాక్షసుడుగా ఇంకా అది సరిపోక, కొత్త నిబంధన
కాలంలో చివరికి తన ప్రియ కుమారుని రక్తాన్ని సైతం తాగేసిన పరమ రాక్షసునిగా కనిపిస్తాడు.
పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- యెహావా కఠినాత్ముడా? లేక కరుణామయుడా?
యెహోవా దీర్ఘ శాంతుడును, కృపాతిశయుడును. -సంఖ్యాకాండము
14:17
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై యున్నావు. -1. వ రాజులు 8:23
వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును,
దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘ శాంతమును
బహుకృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు.-
నెహెమ్యా 9:17
అయితే నీవు మహోపకారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు
కృపాకనికరములుగల దేవుడవై యున్నావు. -
నెహెమ్యా 9:31
యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. -కీర్తన 36:5
ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టు వారందరియెడల
కృపాతిశయము గలవాడవు.
-కీర్తన 86:5
ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు 16. నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.-కీర్తన 86:15
యెహోవా దయాళుడు ఆయన
కృప నిత్యముండును ఆయన సత్యము తర తరములుండును. -
కీర్తన100:5
యెహోవా (1)
దయాదాక్షిణ్య పూర్ణుడు (2) (యెహోవా) దీర్ఘశాంతుడు (3) (యెహోవా) కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.
-కీర్తన 103:8, 9
భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన
కృప అంత అధికముగా ఉన్నది.
-కీర్తన 103:11
యెహోవా
దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన
కృప నిత్యముండును.-
కీర్తన 107:1
ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి యున్నాడు.
యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు.-
కీర్తన 111:4
యెహోవా
దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన
కృప నిరంతరముండును.-
కీర్తన 136:1 (ఇదే విషయం మొత్తం 26 కీర్తనలలో ఉన్నది)
తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని
క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన
కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19. ఆయన మరల మన యందు
జాలిపడును, మన దోష ములను అణచి వేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.-
మీకా 7:18, 19
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు 13. మీ దేవుడైన యెహోవా
కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. -
యావేలు 2:12, 13
పైన పేర్కొన్న పాత నిబంధనకు చెందిన పరిశుద్ధ వాక్యాలు దేవ దేవుడైన యెహోవాను అత్యంత కృప, సమాధానములు కలిగిన వానిగా చూపిస్తున్నాయి. కరుణావాత్సల్యములు మరియు శాంతమూర్తి అయిన యెహోవాను గురించి క్రొత్త నిబంధన ఏమంటుందో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.-యోహాను 3:16
ప్రియులారా, మనము ఒకని నొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. 8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. 9. మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. -1. వ యోహాను 4:7-9
క్రొత్త నిబందంకు చెందిన పరిశుద్ధ వాక్యాల ప్రకారమూ పరమ తండ్రి అయిన యెహోవా అత్యంత కృప, సమాధానములు కలిగిన దేవుడని సుస్పష్టం అయ్యింది. స్థలాభావం వలన కొన్ని వాక్యాలను మాత్రమే పెర్కొనటమైంది. 'పరిశుద్ధ బైబిలు గ్రంధం'లో ఇంకా అలాంటి వాక్యాలు వందల సంఖ్యలో ఉన్నాయి.
గమనిక: యేసును పుట్టించి, ఈ లోకానికి పంపించటానికి గల మూల కారణం- దేవ దేవుడైన యెహోవాకు మానవాళి పట్ల ఉన్న అపారమైన ప్రేమే కారణమని క్రొత్త నిబంధనకు చెందిన (యోహాను 3:16) పై వాక్యం తెలియజేస్తుంది. అలాగే- క్రొత్త నిబంధనకు చెందిన (1. వ యోహాను 4:8) వాక్యమైతే- 'దేవ దేవుడైన యెహోవా స్వరూపమే ప్రేమా మయం' అని ప్రకటించటం పరాకాష్ఠ! దీనిని బట్టి- పాత, క్రొత్త నిబంధనల ప్రకారం- దేవ దేవుడైన యెహావా కరుణామయుడే కాని, కఠినాత్ముడు కాడు! అని తేలిపోయింది!!
దేవ దేవుడైన యెహోవాకు చెందిన అంత గొప్ప కరుణా వాత్సల్యములను దాచి పెట్టి, మానవులు చేసే ప్రతి చిన్న పాపానికీ పశువుల 'రక్తం' త్రాగే రాక్షసునిగా ఇంకా అది సరిపోక, చివరికి తన ప్రియ కుమారుని రక్తాన్ని సైతం తాగేసిన పరమ రాక్షసునిగా ఆయనను చిత్రించి చూపటం ఎంతటి దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించగలరు!
"ఇట్టే క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల గొప్ప ప్రేమామయుడైన యెహోవా దేవుడు మానవుల పాపాలను క్షమించటానికి యేసు 'రక్తము'ను 'అపరాధ రుసుము' (పెనాల్టి) గా కోరుకున్నాడు" అని
నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్న బోధ- 'పరిశుద్ధ బైబిలు గ్రంధ' ప్రబోధలకు
పూర్తిగా వ్యతిరేకమైన ఒక అసత్య బోధ అని సుస్పష్టం అవుతుంది.
కనుక ప్రియ క్రైస్తవులారా!
బైబిలు బోధలను మాత్రమే నమ్మండి!
ఇంకా వాటికి
అనుకూలమైన బోధనలను చేసే బోధకులనే అనుసరించండి!
ఎందుకంటే-
అయ్యో, వేష ధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోకరాజ్యమును మూయుదురు; 14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. 15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. -మత్తయి 23:13-15
అని యేసు హెచ్చరిస్తున్నారు. ఈనాటి అధిక శాతం బోధకులు బైబిలు చేత పట్టుకొని అదే బైబిలుకు వ్యతిరేక బోధలు చేస్తున్నారు. దానికి- ఒక బోధకుడంటే మరొక బోధకునికి ఉన్న శతృత్వం మరియు 'పిండికొలది రొట్టె' అన్నట్లు 'డబ్బు కొలది ప్రార్ధన' వంటి విధానాలే ఆధారాలు. అలాంటి అబద్ధ బోధకుల అసత్య బోధలను అనుసరిచే వారి కొరకు పరలోక రాజ్యము (అనగా స్వర్గము) మూసివేయబడుతుంది. అంతే కాదు, అలాంటి అబద్ధ బోధకులను అనుసరించటం వలన రెండింతలు నరక పాత్రులు కాక తప్పదు అని యేసు హెచ్చరిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త!
M. A. Abhilash
91+96664 88877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.