Posted by Sakshyam Magazine on Tuesday, August 8, 2017
నిజానికి మతమంటే అభిప్రాయమని అర్ధం. అంటే ఎవరి అభిప్రాయం వారికి మతమన్నమాట! అయితే ధర్మం మటుకు ఎప్పటికీ ఒక్కటే. ధర్మమన్న మాటకు మన పండితులు ఈశ్వరాజ్ఞ అని శెలవిచ్చారు.
భగవంతుణ్ణి ఆజ్ఞాపాలన చేయడమే మన కర్తవ్యం తప్ప మన స్వంత అభిప్రాయాలు కల్పించుకుని వాటిని స్థాపించాలని చూడడం అధర్మమే అవుతుంది. ఈరోజు మతం పేరు చెప్పి అత్యధికంగా జరుగుతున్నది అదే!
ధర్మం గూర్చి,భగవంతుణ్ణి గూర్చి మరింత శాస్త్ర బద్ధమైన విశ్లేషణ చేయాల్సివుంది. త్వరలో ఆ ప్రయత్నం కూడా చేస్తాం!
ఎవరికైనా దేవుడూ ఒక్కడే! ధర్మమూ ఒక్కటే అయితే ఆయా కాలాలను బట్టి, ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి క్రతువులు మారుతూ ఉంటాయ్. అంతమాత్రం చేత అదీ,ఇదీ ఒక్కటే ఎలా అవుతుంది? అని వాదించడం అర్ధరహితమవుతుంది.
క్రతువులు (షరియత్ : ఆచార పద్ధతులు)పరంగా వేదం,బైబిల్,ఖురాన్ వేరు కావచ్చు. కాని విశ్వాసాల పరంగా ఈమూడూ ఒక్కటే. వీటిలో ప్రస్తావించబడిన దైవ ప్రస్తావన ఒక్కటే. పరిశీలించే విజ్ఞులకు ఆ విషయం ఇట్టే అవగతమవుతుంది. మూర్ఖంగా వెదికే వారికి గ్రుడ్డిగా నమ్మేవారికి, తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్న వితండవాదులకు అర్ధమై చావదు. నిజానికి భగవంతుణ్ణికి కూడా అటువంటి వారికి జ్ఞానోదయం చేయడు.
అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అందరి దేవుడూ ఒక్కడే అనడం కూడా పెద్ద అబద్ధం అవ్వదా? నిజానికి ఇది ఎంత దారుణమైన వాదన. విజ్ఞులు పరిశీలించాలి. ఇదే నిజమైతే “
యేకే ఏవనో దూత్యో”. “ద్వావ భూమిజనయాన్ దేవ ఏకః” (
దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. భూమికి, ఆకాశానికి సృస్తికర్త ఒక్కడే ) అన్న వేద మంత్రమూ,
మన దేవుడైన యెహోవా “అద్వితీయుడైన” యెహోవా అన్న బైబిల్ వాక్యమూ,
ఒకవేళ ఆకాశాలలో, భూమిలో “ఒక్క అల్లాహ్ తప్ప” ఇతర దేవుళ్లు కూడా ఉంటే, అప్పుడు [భూమ్యాకాశాల] రెండిటి వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. అన్న ఖురాన్ వాక్యమూ అర్ధరహితమే కదా?