Posted by Sakshyam Magazine on Tuesday, July 8, 2014
ఆయతులు:286 అవతరణ:మదీనాలో
అనంతకరుణామయుడు,అపారకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1-5 అలిఫ్ లాం మీం.ఇది అల్లాహ్ గ్రంధము.ఇందులో ఏమాత్రం సందేహం లేదు.అల్లాహ్ భీతిగలవారికి ఈ గ్రంధం మార్గదర్శకం -వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు.నమాజును స్థాపిస్తారు.మేము ప్రసాదించిన దానినుండి [మా మార్గంలో] ఖర్చు చేస్తారు.మేము నీపై అవతరింపచేసిన గ్రంధాన్ని[ఖురాన్],నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంధాలను విశ్వసిస్తారు.పలోకాన్ని దృఢంగా నమ్ముతారు.ఇలాంటి వారు తమ ప్రభువు తరపునుండి ఋజుమార్గంలో ఉన్నారు.సాపల్యం పొందేవారు వారే.
6-7 [ఈ విషయాలను]తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా,హెచ్చరించకపోయినా ఒకటే.వారు విస్వసించేవారు కారు.అల్లాహ్ వారి హృదయాలకూ,వారి చెవులకూ ముద్ర వేశాడు.వారి కన్నులపై తెరపడింది.వారు కఠిన శిక్షకు అర్హులు.
8-20 "అల్లాహ్"ను,అంతిమదినాన్ని మేము విశ్వసించాము" అనేవారు కూడా కొందరు ఉన్నారు.కాని వాస్తవంగా వారు విస్వాసులు కారు.అల్లాహ్ నూ,విశ్వాసులనూ వారు మోసం చేస్తున్నారు.కాని యధార్ధంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చెయ్యటం లేదు.అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది.అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేసాడు.వారు చెప్పే ఈ అబద్ధానికిగాను, వారికి వ్యధాభరితమైన శిక్షపడుతుంది.
"అవనిలో కల్లోలాన్ని రేకతించకండి"అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలం మాత్రమే" అని అంటారు-జాగ్రత్త!వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు.కాని వారు గ్రహించడంలేదు. "ఇతరులు విశ్వసించిన విధంగానే మీరూ విశ్వసించండి"అని వారితో అన్నప్పుడు వారు "మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా?"అని జవాబిస్తారు -జాగ్రత్త! వాస్తంగా వారే మూర్ఖులు,కాని అది వారికి తెలియదు.విశ్వాసులను కలసినప్పుడు వారు "మేము విశ్వసించాము"అని అంటారు.కాని తమ షైతానులను ఏకాంతంగా కలసినప్పుడు వారు "అసలు మేము మీతోనే ఉన్నాము.వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము"అని అంటారు.-అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు.ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాదు.వారు తలబిరుసుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు.సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుకున్న ప్రజలు వారే.కాని వారి యీ బేరం వారికి లాభదాయకమయింది కాదు.వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు.
వారి ఉపమానం ఇలా వుంది:ఒకవ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి.అప్పుడు అల్లాహ్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు.వారు చెవిటివారు,మూగవారు,గ్రుడ్డివారు.ఇక వారు [ఋజుమార్గానికి]మరలిరారు.లేదా మరొక ఉపమానం :ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది.దానికి తోడు చిమ్మచీకట్లు,ఉరుములు,మెరుపులు!ఉరుముల భీకర ధ్వని విని మృత్యుభయం చేత వారు తమ వేళ్లను చెవుల్లో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ సత్యతిరస్కారులను అన్ని వైపులనుండి పరివేష్టించి ఉన్నాడు.వారి పరిస్థితి,మెరుపులు వారి దృష్టిని ఎగర వెసుకుపోతాయా అనే విధంగా ఉంది.వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు.చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు.-అల్లాహ్ కోరితే వారి వినికిడినీ,వారి చూపులనూ సంపూర్ణంగా నశింపచేసేవాడే.నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Next : coming soon