Posted by Sakshyam Magazine on Sunday, November 16, 2014
యేసు నిజంగా దేవుడే అయివుంటే ప్రజలకు ప్రత్యక్షం అవ్వటం, అవ్వకపోవటం అన్నది ఆయన స్వీయ అభీష్టం ప్రకారమే జరగాలి.ఎందుకంటే దేవుడనేవాడు "
సర్వ స్వతంత్రుడై" ఉంటాడు. "
పరతంత్రుడై" ఉండేవాడు దేవుడు ఏమాత్రం కాలేడు.ఈ విషయంలో యేసును "
ఓ యేసూ! మీరు స్వయంగా ఈ లోకానికి వచ్చారా? లేక మిమ్మల్ని ఎవరైనా పంపిచారా?" అని ప్రశ్నిస్తే స్వతహాగా ఇచ్చే సమాధానం ఏమిటో ప్రత్యక్షంగా ఛూడండి.
...నేను దేవుని (యెహోవా) యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను,
నా అంతట నేనే వచ్చి యుండలేదు, ఆయన (యెహోఅవా) నన్ను పంపెను.
-యొహాను 8:42 6:38,44,57; 7:16,18; 8:16,26,29; 12:49; 17:25.
తన అభీష్టంతో ఈ లోకానికి రాలేదని యేసు స్వయంగా చెబుతున్న పై వాక్యాల్న్నిటి ద్వారా అర్ధమవుతుంది. మరెలా వచ్చారు? సర్వశక్తిగల దేవుడైన యెహోవా పంపగా వచ్చారు.ఒకవేళ యేసు యెహోవా వంటి దేవుడే అయి ఉంటే స్వతహాగా రావాలి.ఒకరు పంపితే వచ్చేవాడు దేవుడు ఎలా కాగలడు?
***