Posted by Sakshyam Magazine on Wednesday, November 19, 2014
ఈనాటి ప్రచారంలో యేసును దేవునిగా నమ్ముకోండి. ఆయన మహిమ గల దేవుడు , అయితే ఇది ఎంత అబద్ధమో ఈ వాక్యంలో చూడగలరు.
అందుకు యేసు - నన్ను నేనే మహిమ పరచుకొనిన యెడల
నా మహిమ వట్టిది.మా దేవుడని మీరెవని గూర్చి చెప్పుదురో
ఆ నా (యెహోవా) తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు. యోహాన్ 8:54
ఈవాక్యం ప్రకారం -యేసు కలిగి ఉన్న మహిమ యెహోవా దేవుడు ఆయనకు పెట్టిన ఒక భిక్ష మాత్రమే అని స్వయంగా యేసు బోధ ద్వారా అర్ధమవుతుంది. అయితే దేవుడు ఒక భిక్షగా పెట్టిన ఆ మహిమను యేసు తనే సొంతం చేసుకున్నారా? అన్న ప్రశ్నకు యేసు ఇస్తున్న సమాధానం ఏమిటో ఈక్రింది వాక్యంలో చూడగలరు.
మనము (యెహోవా-యేసు) ఏకమైయున్నలాగున్న వారు
(ఆదిమ అపోస్తలులు) ను ఏకమైయుండవలెనని నీవు నాకు
అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని. యొహాన్ 37:22
ఈవాక్యాన్ని బట్టి యెహోవా ద్వారా పొందిన మహిమ యేసు తన శిష్యులకు ఇచ్చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం యేసు వద్ద ఎలాంటి మహిమా లేదని యేసు స్వయంగా చేస్తున్న పై బోధను బట్టి తేటతెల్లమవుతుంది.మహిమ లేని యేసు దేవుడు ఎలా కాగలరు?